పెళ్లికానుక.. నిబంధనల మెలిక
నిరుపేద వధువులు వివాహాలు చేసుకోడానికి వీలుగా వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీతోఫాకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలు వివరిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం జీఓ నం. 50 విడుదల చేసింది.
వైఎస్ఆర్ కల్యాణమస్తుకు దరఖాస్తులే లేవు
వాలంటీర్ల నుంచి సేకరించేలా సన్నాహాలు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
నిరుపేద వధువులు వివాహాలు చేసుకోడానికి వీలుగా వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీతోఫాకు దరఖాస్తు చేసుకునే విధివిధానాలు వివరిస్తూ ఈ ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం జీఓ నం. 50 విడుదల చేసింది. అయితే దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని సంప్రదించాలి అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ కారణంగా రెండునెలలైనా ఇంతవరకు ఒక్క దరఖాస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు (డీఆర్డీఏ) రాలేదు. ఇక్కడ లాగిన్లో దరఖాస్తు నమోదైతే కలెక్టర్ లాగిన్కి పంపుతారు. అక్కడి నుంచి కల్యాణమస్తు నిధులు మంజూరు చేస్తారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న పెళ్లికానుక ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దీనిని రద్దు చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నుంచి వైఎస్ఆర్ పెళ్లికానుక, షాదీతోఫా కింద నగదు చెల్లించేలా జీఓ ఇచ్చారు. కానీ దీని గురించి పెద్దగా తెలియక పోవడం, నిబంధనలు కఠినంగా ఉండటంతో చాలామంది అసలు దరఖాస్తే చేయలేదు. దీనికితోడు ఇప్పటివరకు మూఢం కావడంతో పెళ్లి ముహూర్తాలు పెద్దగా లేవు. ఈనెల నుంచి ముహూర్తాలు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులంతా కల్యాణమస్తుకు దరఖాస్తు చేసుకునేలా వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇకపై వాలంటీర్లు వారి పరిధిలో జరిగే వివాహాల గురించి తెలుసుకుని ఈ పథకాల గురించి లబ్ధిదారులకు తెలియజేయాల్సి ఉంది.
లబ్ధి ఇలా..
* ఎస్సీ, ఎస్టీ : రూ. 1,00,000 ఎస్సీ, ఎస్టీల్లో కులాంతర వివాహాలు: రూ. 1,20,000
* బీసీ రూ. 50,000 బీసీ కులాంతర వివాహం రూ. 75,000
* మైనారిటీలకు రూ. లక్ష
* దివ్యాంగులకు రూ. 1,50,000
నవంబరు 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకుంటే ఫిబ్రవరిలో... ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అర్జీ పెట్టినవారికి మే నెలలో... మే నుంచి జులై 30 వరకు ఆగస్టులో... ఆగస్టు నుంచి అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకుంటే నవంబరులో నగదు జమ చేస్తారు.
అర్హతలు ఇలా..
* పెళ్లిరోజుకు వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాలి. మొదటి పెళ్లి అయి ఉండాలి. భర్త చనిపోయిన స్త్రీ అయితే రెండో పెళ్లి చేసుకున్నా అర్హురాలే.
వధూవరులు ఇద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* కుటుంబ ఆదాయం పల్లెల్లో రూ. 10 వేలు, పట్టణాల్లో రూ. 12 వేలు మించకూడదు.
* కుటుంబ భూమి మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు.
* కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారుడు ఉండకూడదు. నెలసరి విద్యుత్ వాడకం 300 యూనిట్లకు మించకూడదు. 12 నెలల విద్యుత్తు వినియోగం సగటున తీసుకుంటారు. కుటుంబంలో ఏ వ్యక్తి ఆదాయ పన్ను కట్టకూడదు. కుటుంబ పట్టణ ఆస్తి 1000 చ.అ. మించకూడదు.
గతంలో తెల్లరేషన్ కార్డు ఉన్న వధువు తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే నగదు ఇచ్చేవారు. ఇప్పుడు విద్యుత్తు వినియోగం నిబంధనతో చాలామంది అర్హత కోల్పోయే ఆస్కారం ఉంది. పదోతరగతి అర్హత కారణంగా పల్లెల్లో చదువు మానేసిన ఆడపిల్లలకు లబ్ధి అందకుండా పోయే ప్రమాదం ఉంది.
దరఖాస్తులు రాలేదు
లక్ష్మీపతి డీఆర్డీఏ పీడీ, అనకాపల్లి జిల్లా
కల్యాణమస్తు దరఖాస్తులు డీఆర్డీఏ లాగిన్కి రావాలి. ఇక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి పంపుతాం. అక్కడ పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. ప్రస్తుతం డీఆర్డీఏ లాగిన్కి ఒక్క దరఖాస్తూ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం మా లాగిన్కి అవి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్