వీడని పీఠముడి
వైకాపాలో అంతర్గత రాజకీయం అట్టుడుకుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పట్టుబడుతున్నారు.
పట్టువీడని ఎమ్మెల్యే.. మెట్టు దిగని ఛైర్పర్సన్!
అధికార పార్టీలో అట్టుడుకుతున్న వైనం
నర్సీపట్నం అర్బన్, న్యూస్టుడే : వైకాపాలో అంతర్గత రాజకీయం అట్టుడుకుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పట్టుబడుతున్నారు. పురపాలక ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి మాత్రం మెట్టు దిగడం లేదు. ఎమ్మెల్యే మాట నెగ్గుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. 28 వార్డులున్న నర్సీపట్నం పురపాలక సంఘంలో రెండేళ్ల కిందట ఎన్నికలు జరిగినప్పుడు వైకాపా 14 వార్డులను, తెదేపా 12 వార్డులను గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకరు, జనసేన నుంచి ఒకరు గెలిచారు. తొలి రెండేళ్లు ఆదిలక్ష్మి, తదుపరి రెండేళ్లు పెదబొడ్డేపల్లికి చెందిన బోడపాటి సుబ్బలక్ష్మి ఛైర్పర్సన్లు వ్యవహరిస్తారని ప్రమాణ స్వీకారం రోజున ఎమ్మెల్యే గణేష్ బహిరంగంగా ప్రకటించారు. 40 రోజుల కిందట ఎమ్మెల్యే గణేష్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఛైర్పర్సన్తో రాజీనామా చేయించాలని నిర్ణయించారు. ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార మార్పిడి ప్రక్రియపై దృష్టిసారించలేదు. తాజాగా సోమవారం రాత్రి వైకాపా కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులతో ఎమ్మెల్యే తన నివాసంలో సమావేశమయ్యారు. ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ‘ఇప్పటికే రాజీనామా చేయాల్సింది. బుధవారంలోగా చేయాల’ని ఛైర్పర్సన్కు సూచించారు. ‘అధిష్ఠానం ఆదేశం పాటించాల్సిందే.. లేదంటే ఎలాంటి సహకారం ఉండద’ని కుండబద్దలు కొట్టారు. సమావేశంలో ఆదిలక్ష్మి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఓ లక్ష్యం (విజన్)తో ఛైర్పర్సన్ బాధ్యత తీసుకున్నా. అనుకున్నట్లుగా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లంతా ఎమ్మెల్యే నిర్ణయానికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మన ఎమ్మెల్యే సౌమ్యుడు. ఇంకో ఎమ్మెల్యే అయితే వేరేగా మాట్లాడి ఉండేవార’ని ఓ వార్డు నాయకుడు స్వరం పెంచి మాట్లాడటంతో ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాన్ని పాటిస్తారా, లేదా అని ఉత్కంఠ మొదలైంది. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేనందున రాజీనామా చేయకపోవచ్చని కొందరు, ఎమ్మెల్యే మాటను ఆమె జవదాటరని మరికొందరు చెబుతున్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్ మినీస్టేడియంలో మంగళవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నగదు విడుదల సమావేశానికి ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి హాజరుకాకపోవడంపై ఆ పార్టీ నాయకుల్లో చర్చ జరుగుతోంది. నెలాఖరున కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలక పరిణామాలు చోటుచేసుకునే ఆస్కారముందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం