ఇక మూడుపూటలా కోడిగుడ్డు
కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది.
నేటి నుంచి కేజీహెచ్ డైట్లో మార్పు
రోగులకు ఆహారం పంపిణీ చేస్తున్న సిబ్బంది
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది. ఇదే సమయంలో ఆహారం విషయంలో పలు మార్పులు చేసింది. 15ఏళ్ల నుంచి కేజీహెచ్లో రోగులకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. గుత్తేదారులు 10శాతం తగ్గించి టెండర్లు వేయడంతో రోజుకు ఒక్కో రోగిపై రూ.36 మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తూ వస్తోంది. దీని వల్ల నాణ్యత సరిగా ఉండడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోగుల డైట్ ఖర్చును రెట్టింపు చేసి రూ.80కు పెంచింది. ఇదే సమయంలో మెనూలో మార్పులు చేశారు.
* ఫిబ్రవరి నెలలో డైట్ గుత్తేదారుని నియమించేందుకు టెండర్లు పిలిచారు. నలుగురు గుత్తేదారులు ముందుకు వచ్చారు. నలుగురు ఒకే రకంగా కొటేషన్లు వేయడంతో ఒక్కొక్కరికి ఆరేసి నెలల చొప్పున డైట్ పనులను జిల్లా యంత్రాంగం అప్పగించింది. కొత్త కాంట్రాక్టు శనివారం నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుత మెనూ ఇలా..:
* అల్పాహారం కింద పాలు/రొట్టె, కిచిడి, ఎర్రనూక ఉప్మా, తెల్లనూక ఉప్మాలో ఏదో ఒకటి ఇస్తున్నారు. బీ ఉదయం, రాత్రి భోజనంలో.. 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, 160 గ్రాముల కూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, మజ్జిగ అందజేస్తున్నారు.
ఇక మీదట ఇలా..
* అల్పాహారంగా ఇడ్లీ 3(150 గ్రాములు), ఉప్మా, పాలు-రొట్టెల్లో ఏదో ఒకటి, ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇవ్వనున్నారు.
* ఉదయం, రాత్రి భోజనంలో 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, గ్రేవీ కర్రి లేదా ముద్దకూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, 200 గ్రాముల మజ్జిగ పంపిణీ చేయనున్నారు.
* కిడ్నీ వ్యాధి బాధితులకు ఉప్పు రహిత ఆహారం, మధుమేహ బాధితులకు అన్నం తక్కువ, ఉడకబెట్టిన కూరలు, పుల్కాలతో కూడిన ఆహారం ఇవ్వనున్నారు.
ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనం : పాత, కొత్త మెనూలను పరిశీలిస్తే.. కొత్త దాంట్లో కేవలం 3 ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనంగా ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మెనూకు ఛార్జీలు రెట్టింపు చేసి రూ.80 ఇస్తున్నారు. నాణ్యత పెంచుతామని, అధిక పోషక విలువలున్న ఆహారం రోగులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
పక్కాగా మెనూ అమలుకు చర్యలు
ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రోగులకు పంపిణీ చేసే ఆహారంలో శనివారం నుంచి మార్పులు చేస్తున్నాం. జేసీ ఆదేశాల మేరకు నలుగురు గుత్తదారులు ఒక్కొక్కరు ఆరు నెలల చొప్పున కాంట్రాక్టు నిర్వహిస్తారు. ఆహార నాణ్యత విషయంలో నిరంతర నిఘా ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆహారంతో పోల్చితే కొత్తగా ఇవ్వబోయే దానిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.
-హెచ్.వి.ఆర్.మూర్తి, చీఫ్ డైటీషియన్, కేజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్