విశాఖలో ధోనీ ఆటకు అభిమానుల ఫిదా
ధనాధన్ ధోనీ రాకతో విశాఖ అభిమానులు ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్- చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై జట్టుపై విజయం సాధించింది.
న్యూస్టుడే, విశాఖ క్రీడలు
బ్యాటింగ్ చేస్తున్న ధోనీ
ధనాధన్ ధోనీ రాకతో విశాఖ అభిమానులు ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దిల్లీ క్యాపిటల్స్- చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 పరుగుల తేడాతో చెన్నై జట్టుపై విజయం సాధించింది. రెండో బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టులో ధోనీ ఎప్పుడొస్తాడా అంటూ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూశారు. ఆ జట్టు అయిదు వికెట్లు పడగానే ధోనీ క్రీజ్లోకి వస్తుండడంతో ఒక్కసారిగా స్టేడియంలోని గ్యాలరీలన్నింటిలోను అభిమానులు లేచి నిలబడి వారి సెల్ఫోన్లలో టార్చ్లైట్లు వేస్తూ ధోనీ .. ధోనీ అంటూ స్వాగతం పలికారు. స్టేడియం అంతా కరతాళ ధ్వనులతో హోరెత్తింది. దిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించినప్పటికీ అభిమానులు మాత్రం ధోనీ ఆటకు ఫిదా అయ్యారు.
చెన్నై జట్టు క్రీడాకారులు
స్టేడియం బయట ధోనీపై తమ అభిమానాన్ని చాటుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న యువత
గెలిచిన ఆనందంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టు
ఐపీఎల్ మ్యాచ్ పదనిసలు
ఛీర్గాల్స్ సందడి
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: దిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
- స్టేడియంలోని గ్యాలరీల్లో సీట్లు రాత్రి ఏడుగంటలకే దాదాపు ఎనభైశాతం వరకు నిండిపోగా 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి దాదాపు గ్యాలరీలన్నీ నిండిపోయాయి.
- స్టేడియంలో చీర్గాల్స్ తమ జట్ల జెండాలు పట్టుకుని అభిమానులను ఉత్సాహపరిచారు.
- మూడో ఓవర్లో దీపక్చాహర్ వేసిన తొలిబంతికే డేవిడ్ వార్నర్ అద్భుతమైన సిక్సర్ కొట్టడంతో స్టేడియంలో అభిమానులు కేరింతలు కొట్టారు.
- స్టేడియంలో చెన్నై జట్టు క్రీడాకారుల జెర్సీలతో పసుపుమయంగా మారింది.
- డేవిడ్ వార్నర్ సిక్సర్ కొట్టడంతో పిచ్కు ఇరువైపులా ఉండే వికెట్లు నీలం, ఎరుపు రంగులు విరజిమ్మాయి. అలా మూడుసార్లు రంగులు ఆగి వెలగడంతో అభిమానులు కొత్త అనుభూతిని పొందారు.
- దీపక్చాహర్ మరో ఓవర్లో డేవిడ్ వార్నర్ వరుసగా ఒక సిక్సర్, రెండు బౌండరీలు కొట్టడంతో వార్నర్ వార్నింగ్ అంటూ స్టేడియంలో స్కోర్బోర్డు మీద రావడంతో అభిమానులు ఔనా అంటూ బోర్డువైపు చూశారు.
- రాత్రి 9 గంటలకు అన్ని గ్యాలరీల్లో నుంచి అభిమానులు సెల్ఫోన్లతో టార్చ్లైట్ వేసి ధోనీ.. ధోనీ అంటూ నినాదాలు చేశారు.
- రెండో బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు క్రీడాకారుల బ్యాటింగ్ను చూసేందుకు స్టేడియం బయట ఉన్న అభిమానులు ఒక్కసారిగా గేటు నెంబరు పది వద్దకు వచ్చి లోపలకు చొచ్చుకొని వచ్చారు. పక్కనే ఉన్న ఆలయం గోడ ఎక్కి స్టేడియంలోకి ప్రవేశించారు. నిర్వాహకులు వారిని బయటకు పంపివేశారు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులు
యువతుల ఉత్సాహం
52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల