తలరాతలు మార్చేది ఇలాగేనా జగన్?
అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలే ఇందుకు నిదర్శనం.
ఇంటర్ ఫలితాల్లో అట్టడుగున స్థానాల్లో..
మన పిల్లలు జాతీయ స్థాయిలో రాణించాలి.. అందుకోసమే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం. రూ.వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల తలరాతలు మార్చుతున్నాం
సీఎం జగన్ తరచూ చెప్పే మాటలివి.
ఆయన దృష్టిలో స్కూళ్లు, కాలేజీ భవనాలకు రంగులు వేస్తే విద్యార్థుల తలరాతలు మారిపోతాయనుకున్నారేమో.
పాడేరు/పట్టణం, న్యూస్టుడే: అవసరమైన పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకుండా.. అధ్యాపకుల పోస్టుల భర్తీ లేకుండా ఉత్తమ ఫలితాలు ఆశించడం కలే అవుతుంది. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. గతేడాది వరకు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఫలితాలు ఇవ్వగా ఈ ఏడాది 26 జిల్లాల వారీగా విడుదల చేశారు. అందులో అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలిచి నిరాశపరిచాయి. ఎప్పటిలానే ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు.
అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 48 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 70 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై 20వ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల కంటే గిరిజన గురుకులాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత, పాఠ్య పుస్తకాల పంపిణీలో జాప్యం తదితర కారణాలు ఉత్తీర్ణత శాతంపై తీవ్రంగా ప్రభావం చూపాయి.
బాధ్యులెవరు?
జిల్లావ్యాప్తంగా 22 మండలాలు ఉన్నాయి. వీటిలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రధాన సమస్యలపై దృష్టి సారించి సరిదిద్ది ఉంటే ఇంత దారుణంగా ఫలితాలు ఉండేవి కాదు. ప్రధానంగా అధ్యాపకుల కొరత కారణంగా అతిథి అధ్యాపకులతో నెట్టుకొచ్చారు. వారికి సకాలంలో వేతనాలు చెల్లించలేదు. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఒక్కరు మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉండేవారు. వారు కూడా ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించడంతో వారి సబ్జెక్టును పిల్లలకు బోధించేందుకు సమయం దొరకని పరిస్థితి. ఒక్కో కశాశాలలో పరిమితికి మించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, ఆపై వారికి బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడంతో సిలబస్ పూర్తి చేయలేదు. పాఠ్య పుస్తకాలు సైతం సకాలంలో అందలేదు.
హై స్కూల్ ప్లస్లో జీరో శాతం
దేవీపట్నం: దేవిపట్నం మండలం ముసినిగుంట బాలికల పాఠశాల్లో హై స్కూల్ ప్లస్లో ఇంటర్ ప్రథమ ఫలితాల్లో 14 మందికి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 19 మందికి గాను ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేదు. అడ్డతీగల, వీఆర్ పురం(రేఖపల్లి), వై.రామవరం తోటకూరపాలెం కాలేజీల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.
అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 31 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాయగా 11 మంది ఉత్తీర్ణులయ్యారు. 38.48 శాతం మాత్రమే నమోదైంది. నెల్లిపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 16 మందికి ఒక్కరు మాత్రమే పాసయ్యారు.
మొదటి సంవత్సరంలోనూ...
జిల్లావ్యాప్తంగా మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోయింది. అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 233 మంది విద్యార్థులకు 222 మంది హాజరు కాగా.. కేవలం 19 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక్కడ ఉత్తీర్ణత శాతం 8.56గా నమోదైంది. హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 229 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇక్కడ 50 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 21.83 శాతంగా నమోదైంది. అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 44 మందికి తొమ్మిది మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ కళాశాలలో 20.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వై.రామవరం కేజీబీవీలో 15 మంది హాజరు కాగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాజవొమ్మంగి, అడ్డతీగల హైస్కూల్ ఫ్లస్లలో ఒక్కరు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇక్కడ ఒక్కో చోట నలుగురు విద్యార్థులు చొప్పున హాజరు కాగా.. ఒక్కరూ ఉత్తీర్ణులవ్వలేదు. రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 140 మందికి 17 మంది మాత్రమే పాసయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు