logo

వాహనాల విస్తృత తనిఖీలు

కశింకోట మండలం తాళ్లపాలెం - నర్సీపట్నం రహదారిలో ఎన్నికల ప్లయింÞ్ స్క్వాè్ సిబ్బంది శుక్రవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.

Published : 14 Apr 2024 03:58 IST

రూ.5లక్షల నగదు స్వాధీనం

కశింకోట, న్యూస్‌టుడే: కశింకోట మండలం తాళ్లపాలెం - నర్సీపట్నం రహదారిలో ఎన్నికల ప్లయింÞ్ స్క్వాè్ సిబ్బంది శుక్రవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. స్క్వాè్ అధికారులు జయలక్ష్మణË్, జగదీష్‌బాబు ఆధ్వర్యంలో బృందం తనిఖీలు  నిర్వహిస్తోంది. సంత నిర్వహించే ప్రాంతంలో ఓ కారులో నగదు దొరికింది. విశాఖకు చెందిన ఓ వ్యక్తి నర్సీపట్నం వైపు కారులో ప్రయాణిస్తూ ఎటువంటి ధ్రువపత్రాలు, ఆధారాలు లేకుండా రూ. 5 లక్షల నగదు తీసుకెళ్తున్నారు. బృందం చేపట్టిన తనిఖీల్లో ఈ నగదును స్వాధీనం చేసుకుంది. అనకాపల్లి ట్రెజరీ కార్యాలయానికి అప్పగించినట్లు అధికారి తెలిపారు.

విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. శనివారం కూడా తనిఖీలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని