logo

రూ.3.6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

సరైన ధ్రువపత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.3.6 కోట్ల విలువైన బంగారం తరలిస్తున్న వాహనాన్ని ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 14 Apr 2024 04:05 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: సరైన ధ్రువపత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.3.6 కోట్ల విలువైన బంగారం తరలిస్తున్న వాహనాన్ని ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి, ఎంఈవో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు టోల్‌ ప్లాజా వద్ద అధికారులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు నుంచి సీక్వెల్‌ లాజిస్టిక్‌ పార్శిల్‌ వాహనం వస్తుండడంతో తనిఖీ చేశారు. అందులో బంగారం ఉన్నట్లు గుర్తించి, పత్రాలు చూపించమన్నారు. డ్రైవర్‌ వద్ద రవాణా వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో దానిని ఎఫ్‌ఎస్టీ అధికారులు పిఠాపురం తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. అందులో ఉన్న బంగారం కాకినాడలోని వివిధ నగలు దుకాణాలకు తరలిస్తున్నట్లు వాహన సిబ్బంది తెలిపారన్నారు. వాహన తలుపులను తహసీల్దారు లక్ష్మీ, శిక్షణా డీఎస్పీ ప్రమోద్‌, సీఐ శ్రీనివాసు, ఎస్సై మురళీమోహన్‌ ఆధ్వర్యంలో తెరిచి, బంగారం ఎంత ఉందో లెక్కించేందుకు జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని