‘ప్రజాగళం’ వినిపించేలా!!
సార్వత్రిక ఎన్నికల ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వస్తున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో ఇప్పటికే వివిధ జిల్లాల్లో సాగుతున్న సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో కూటమి నేతల్లో విజయోత్సాహం కనిపిస్తోంది.
నేడు గాజువాకలో చంద్రబాబు సభ
ఈనాడు, విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ప్రకటన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారానికి వస్తున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో ఇప్పటికే వివిధ జిల్లాల్లో సాగుతున్న సభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుండటంతో కూటమి నేతల్లో విజయోత్సాహం కనిపిస్తోంది. వైకాపా పాలనలో జరిగిన అకృత్యాలను చంద్రబాబు ఎండగడుతున్నారు. అభివృద్ధిపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు కూడా ఆయనతో ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖలో జరిగే సభలు కూడా విజయవంతమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం గాజువాక కూడలిలో రాత్రి ఏడు గంటలకు సభ నిర్వహించనున్నారు. అంతకు ముందు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు.
జనంలో ఆసక్తి: 2019 ఎన్నికల్లో చంద్రబాబు గాజువాక తప్ప విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేపట్టారు. ఆ లోటును భర్తీ చేయడానికి ఈ ఎన్నికల ప్రకటన అనంతరం విశాఖ జిల్లాలో మొదటి ప్రచార కార్యక్రమానికి గాజువాకను ఎంచుకున్నారు. దీంతో తెదేపా కార్యకర్తలతో పాటు జనసేన, భాజపా కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సభకు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, యువత తరలివస్తారని కూటమి నేతలు చెబుతున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విశాఖ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అలాగే.. అనకాపల్లి జిల్లాలో జరిగే రెండు ప్రజాగళం సభల్లో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ నెల 16న చోడవరం, ఎలమంచిలిలో సభలు జరగనున్నాయి. ఈ రెండింటిలో ఇరు పార్టీల అధినేతలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి కొన్ని జిల్లాల్లో ‘ప్రజాగళం’ యాత్రలో పాల్గొనగా.. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సభలకూ అదే స్థాయిలో ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని నేతలు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
[ 27-07-2024]
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు