ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది.
వీఐపీ రోడ్డు మూసివేతతో తరచూ ప్రమాదాలు
ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
దారి మళ్లకుండా ఏర్పాటు చేసిన విభాగిని
కార్పొరేషన్, న్యూస్టుడే: నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. పలువురు ప్రాణాలను కోల్పోతున్నారు. వీఐపీ రహదారి నుంచి ఆశీలుమెట్ట వైపు వాహనాలు వెళ్లకుండా రహదారిని విభాగినులతో మూసివేయడం సమస్యగా మారింది. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ద్విచక్రవాహన చోదకులు బాధితులుగా మారుతున్నారు. వ్యతిరేక మార్గంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ ఇటీవల ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకంటే ముందు ఓ కారు విభాగినిపైకి ఎక్కి బీభత్సం సృష్టించింది. ఆశీలుమెట్ట నుంచి జీవీఎంసీ కార్యాలయం వైపు వస్తున్న ఓ యువతి ద్విచక్రవాహనాన్ని ప్రయివేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, వాహనం నుజ్జయింది.
వీఐపీ రోడ్లో ఎదురెదురుగా వాహనాలు
అందుకే మూసివేత: వాస్తు దోషం కారణంగా సీబీసీఎన్సీ ప్రాజెక్టు పనులు వేగంగా జరగడం లేదని, వీఐపీ రహదారిని మూసివేస్తే వాస్తు దోషం పోతుందనే నమ్మకంతో రహదారిపై విభాగిని ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో వీఐపీ రహదారి- ఆశీలుమెట్ట మార్గంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లేవి. వీఐపీ రహదారి నుంచి వచ్చే వాహనాలు ముందుగా సిరిపురం వైపు తిరిగి, కాస్త ముందుకెళ్లిన తరువాత మలుపు(యూ టర్న్) తీసుకోవాల్సి ఉంటుంది. సిరిపురం నుంచి వీఐపీ రహదారికి రావాలంటే సంపత్ వినాయగర్ ఆలయం దాటి వేమన మందిరం వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘షాపర్స్’ స్టాప్ దాటిన తరువాత కాస్త ముందుకెళితే కుడివైపు తిరిగే వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో టైకూన్ హోటల్ వైపు ఉన్న మార్గాల నుంచి వచ్చే వాహనచోదకులు రాంగ్ రూటÂలో వచ్చి ఎడమ వైపు ఉన్న రహదారిలోకి మారాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు.
టైకూన్ కూడలి వద్ద ఇలా...
ఫిర్యాదులు వస్తున్నా చర్యలేవీ?: వీఐపీ రోడ్డులో విభాగినుల ఏర్పాటుపై ప్రజలపై నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. గతంలో స్వయానా ఎంపీ ఎంవీవీ జీవీఎంసీ కమిషనర్, సీపీలను కలిసి విభాగినులను తొలగించాలని వినతిపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో తన తప్పులేదని తప్పించుకోవడానికి ఎంపీ ఇలా వినతిపత్రాలు ఇచ్చారని నాడు విమర్శలొచ్చాయి. ఇది జరిగి 8 నెలలైనా ఉన్నతాధికారులు విభాగినుల తొలగింపునకు ఎటువంటి చొరవ తీసుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే