రంగంలోకి పసుపు దళం
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు అధినేత చంద్రబాబునాయుడు చేతులమీదుగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఆదివారం బీఫారాలు అందుకున్నారు.
ఫాంలు అందించిన చంద్రబాబు
తదితరులు పాల్గొన్నారు.చంద్రబాబుతో రాజు, బండారు, అయ్యన్న, అనిత
చోడవరం, కె.కోటపాడు, న్యూస్టుడే: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థులు అధినేత చంద్రబాబునాయుడు చేతులమీదుగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఆదివారం బీఫారాలు అందుకున్నారు. వీరిలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం), బండారు సత్యనారాయణమూర్తి (మాడుగుల), కేఎస్ఎన్ఎస్ రాజు (చోడవరం), వంగలపూడి అనిత (పాయకరావుపేట) ఉన్నారు. చోడవరం నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా కేఎస్ఎస్ఎన్ రాజు నాలుగోసారి పోటీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 25న కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నక్కపల్లి, న్యూస్టుడే: కూటమి తరఫున ‘పేట’ అభ్యర్థిగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఉదయం తన నివాసం నుంచి నాలుగు మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరులు హాజరుకానున్నారు. మరోవైపు వైకాపా అభ్యర్థి కంబాల జోగులు సైతం నేడే నామినేషన్ వేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
పాడేరు, చింతపల్లి, న్యూస్టుడే: పాడేరు కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం దక్కింది. చంద్రబాబు చేతులమీదుగా ఆమె బీ-ఫాం అందుకున్నారు. నియోజకవర్గంలో ఈమెకు బలమైన క్యాడర్ ఉంది. గత అయిదేళ్లుగా పార్టీ బలోపేతానికి పనిచేశారు. పాడేరు అసెంబ్లీ సీటును తొలుత కిల్లు వెంకట రమేష్నాయుడికి అధిష్ఠానం కేటాయించింది. రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తానని ప్రకటించారు. అనూహ్య పరిణామాలతో మళ్లీ ఈశ్వరికి టికెట్ ఇచ్చింది.
యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తాం
కశింకోట, న్యూస్టుడే: యువత, మహిళలను మోసగించిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. బయ్యవరం, రామన్నపాలెం గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ఆదివారం సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగిస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి సీఎం.రమేష్, కొణతాల రామకృష్ణను గెలిపించాలని కోరారు. సీఎం రమేశ్ కుమారుడు రిత్విÚ్, నాయకులు కాయల మురళీధర్, ఉగ్గిన రమణమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు