logo

ధర్మవరంలో వైకాపాకు గట్టిదెబ్బ

వైకాపాకు గట్టి పట్టు ఉన్న ధర్మవరంలో గట్టిదెబ్బ తగిలింది. ఎలమంచిలిలోని ధర్మవరంలో ఆదివారం పలువురు వైకాపా నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.

Updated : 22 Apr 2024 05:46 IST

జనసేనలోకి భారీగా చేరికలు 

విజయ్‌కుమార్‌ సమక్షంలో జనసేనలో చేరుతున్న నగిరెడ్డి కాసుబాబు కుటుంబసభ్యులు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: వైకాపాకు గట్టి పట్టు ఉన్న ధర్మవరంలో గట్టిదెబ్బ తగిలింది. ఎలమంచిలిలోని ధర్మవరంలో ఆదివారం పలువురు వైకాపా నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ సమక్షంలో నగిరెడ్డి కాసుబాబు, నాగేశ్వరరావు, అప్పలరమణ, వెంకటరమణతో సహా నగిరెడ్డి కుటుంబసభ్యులంతా వైకాపాను వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఆయన కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. దాదాపు ధర్మవరంలో వైకాపా ఖాళీ అయ్యింది. నగిరెడ్డి శ్రీను, కొఠారు  నరేశ్‌ల ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. ఇదే గ్రామానికి చెందిన 200 మందికి పైగా యువకులు, రాంనగర్‌లో వంద మంది వైకాపాను వీడి జనసేనలో చేరారు. ఇలా ఒక్క రోజులో వందలాది మంది వైకాపాను వీడారు. ఈ సందర్భంగా సుందరపు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కన్నబాబుకు ఇంటికి వెళ్లిపోయే సమయం దగ్గర పడిందన్నారు. ఆయనను ప్రజలు ఇక నమ్మరన్నారు. ధర్మవరానికి పూర్వవైభవం తెస్తానన్నారు. ఒకే రోజు ఇంత మంది పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. నాయకులు కొఠారు సాంబశివరావు, నరేష్‌, నగిరెడ్డి శ్రీను, బొద్దపు శ్రీను, పల్లా సత్యనారాయణ, గుర్రాల శేఖర్‌, గొర్లె నానాజీ, నక్కా శివశంకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని