‘గంజాయి’ తోటల్లో ఆటలు ‘సాగు’తున్నాయ్!
వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయికి చిరునామాగా మారింది. ముంబై పబ్లలో, గోవా బీచ్ల్లో... దిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకు ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది.
ఏజెన్సీలో పడకేసిన ఆపరేషన్ ‘పరివర్తన
అధికార పార్టీ నాయకుల అండతో దర్జాగా సాగు, రవాణా
విశాఖ మీదుగా పలు రాష్ట్రాలకు తరలింపు
స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు (పాతచిత్రం)
ఈనాడు - విశాఖపట్నం : వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయికి చిరునామాగా మారింది. ముంబై పబ్లలో, గోవా బీచ్ల్లో... దిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకు ఎక్కడ గంజాయి దొరికినా ఏపీ పేరే వినిపిస్తోంది. మత్తుకు బానిసలైన విద్యార్థులు, యువత జీవితాలు ఛిద్రమవుతున్నా సీఎం జగన్కు చీమ కుట్టినట్లైనా లేదు. కట్టడికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో అత్యంత డిమాండ్ కలిగిన శీలావతి రకం గంజాయి సాగుకు అడ్డాగా ‘ ఉమ్మడి విశాఖ’ మారింది. ఒడిశా సరిహద్దుల్లో పండించి విశాఖ మీదుగా ఇతర రాష్ట్రాలకు దర్జాగా తరలిస్తున్నారు. సాగు కట్టడికి, యువతలో ఆలోచనల మార్పునకు విశాఖ ఏజెన్సీలో చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన’ పడకేసింది. ఇంటెలిజెన్స్ నివేదికలు, శాటిలైట్ ఫొటోల ఆధారంగా సాగును గుర్తించినా.. సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పన, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంపై కార్యాచరణ లోపించిందనే విమర్శలున్నాయి.
గణాంకాలే చెబుతున్నాయి : అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా రాజధానిగా విశాఖను మారుస్తామంటూ జగన్ ఊదరగొట్టారు. పరిపాలనా రాజధానిగా మార్చలేదు కానీ.. గంజాయికి అడ్డాగా మాత్రం మార్చేశారు. దేశంలో గంజాయి సరఫరాలో ఏపీని మొదటి స్థానంలో నిలిపారు. 2021లో దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంటే అందులో ఏపీ నుంచే 46% స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 23 లక్షల కేజీల గంజాయి పట్టుబడగా, అందులో అత్యధిక భాగం ఏపీ నుంచి సరఫరా అయిందే. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో కంటితుడుపుగా కేసులు నమోదు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో విశాఖ కమిషనరేట్ పరిధిలో కేవలం 13,326 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 1800 మందిపై కేసులు నమోదు చేశారు.
అవును.. నిజమనేలా : గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్షా విశాఖ పర్యటనలో భాగంగా ‘జగన్ పాలనలో విశాఖ అరాచకశక్తులకు అడ్డాగా మారింది’ అని వ్యాఖ్యానించారు. తర్వాత కొద్దిరోజులకే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను రౌడీషీటర్లు కిడ్నాప్ చేసి 48 గంటలపాటు గంజాయి మత్తులో చిత్రహింసలు పెట్టడం సంచలనమైంది. జేబుల నిండా తెచ్చుకున్న గంజాయి ఖాళీ కాగానే.. నిమిషాల వ్యవధిలో బయట నుంచి నేరుగా గంజాయి తెప్పించుకోవడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో దాదాపు 8,500 ఎకరాల్లో సాగు చేసిన రూ.765 కోట్లకు పైగా విలువైన రెండు లక్షల కేజీల గంజాయిని పోలీసులు తగలబెట్టారు. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ పెద్దలు కన్నెర్రజేసినట్లు విమర్శలున్నాయి. సాగు, రవాణాలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉండటంతోనే గంజాయి దహనం చేయకుండా ఒత్తిళ్లు తెచ్చినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలతో గంజాయి రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ఇటీవల పెందుర్తి, నర్సీపట్నానికి చెందిన అధికార పార్టీ నాయకులు గంజాయి రవాణా చేస్తూ చిక్కారు. ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గంజాయి ఖైదీలే ఎక్కువ : వైకాపా పాలకులు అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, గిరిజన యువతను నిరుద్యోగులుగా మార్చి చివరకు గంజాయి రవాణా ఉచ్చులోకి దిగేలా పరోక్షంగా ప్రోత్సహించారు. విశాఖ కేంద్ర కారాగారంలో 9 బ్యారెక్లలో 1700 మంది ఉండగా.. అందులో 1200 మంది గంజాయి కేసుల్లోని రిమాండ్ ఖైదీలే ఉండటం పరిస్థితి తీవ్రతను చాటుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
[ 27-07-2024]
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్