logo

జగన్‌ను ఇంటికి పంపడానికి మహిళలు సిద్ధం

సీఎం జగన్‌ మహిళల మాంగల్యాలు తెంచిన ద్రోహి అని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు.

Updated : 22 Apr 2024 05:07 IST

మాట్లాడుతున్న అనంతలక్ష్మి

కార్పొరేషన్‌, వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ మహిళల మాంగల్యాలు తెంచిన ద్రోహి అని తెదేపా విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు. ఆదివారం జిల్లా తెదేపా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీశారని ఆరోపించారు. పిన్నమ్మ తాళిబొట్టు తెంచిన హంతకుల్ని రక్షిస్త్తున్న జగన్‌ మహిళా ద్రోహి కాదా అని ప్రశ్నించారు. అమరావతి మహిళా రైతులను దారుణంగా హింసించారన్నారు.  తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేశారన్నారు. సెంటు పట్టా పేరుతో మహిళలను అప్పులపాలు చేశారని, అంగన్‌వాడీలను రోడ్లపాలు చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగాయని, దీనికి కారణమైన జగన్‌ను ఇంటికి పంపించడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గనగల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని