logo

29న ‘మీ చెంతకే భవిష్యనిధి’

భవిష్యనిధి ఖాతాదారులు, పింఛనుదారులు, పీఎఫ్‌ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈనెల 29న ‘మీ చెంతకే భవిష్యనిధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సహాయ భవిష్యనిధి ప్రాంతీయ కమిషనర్‌-2 పవన్‌కుమార్‌ తెలిపారు.

Published : 22 Apr 2024 03:35 IST

కరాస, న్యూస్‌టుడే : భవిష్యనిధి ఖాతాదారులు, పింఛనుదారులు, పీఎఫ్‌ సంస్థల యజమానులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈనెల 29న ‘మీ చెంతకే భవిష్యనిధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సహాయ భవిష్యనిధి ప్రాంతీయ కమిషనర్‌-2 పవన్‌కుమార్‌ తెలిపారు. వివిధ పరిశ్రమల్లో పని చేసిన ఉద్యోగులు, యజమానులు వారి సమస్యల వివరాలు పొందుపరిచిన కవర్‌పై ‘నిధి ఆప్కే నికత్‌’ అని రాసి విశాఖపట్నం ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయం, మర్రిపాలెం చిరునామాకు పంపాలి. లేదా ఫ్యాక్స్‌ ద్వారా 0891-2558734 నంబర్‌కు, మెయిల్‌ ద్వారా ro.vizag.epf@india.gov.in కు పంపొచ్చని సూచించారు. 29-04-2024 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాల వారీగా ఈ కింది వేదికల్లో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

  •  విశాఖపట్నం : డీసీసీబీ బ్యాంకు పాత భవనం, మర్రిపాలెం వుడాలేఅవుట్‌. 
  • అనకాపల్లి : ఈఎస్‌ఐసీ శాఖా కార్యాలయం.
  •  అల్లూరి సీతారామరాజు (పాడేరు) : సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌, అరకు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని