logo

సింహగిరిపై వైభవంగా తిరువీధి ఉత్సవం

సింహగిరిపై జరుగుతున్న అప్పన్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవం వైభవోపేతంగా జరిగింది.

Published : 22 Apr 2024 03:44 IST

వేణుగోపాలుడి అలంకరణలో దేవేరులతో స్వామివారు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై జరుగుతున్న అప్పన్న స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. సర్వజన మనోరంజని వాహనంలో వేణుగోపాలుడి అలంకరణలో ఉన్న గోవిందరాజ స్వామిని దర్శించుకున్న భక్తజనం ఆనంద పరవశులయ్యారు. తొలుత అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా పట్టు పీతాంబరాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. సర్వజన మనోరంజని వాహనంపై దేవతామూర్తులను అధిష్ఠింపజేసి సింహగిరి మాడవీధుల్లో ఊరేగించారు.  తిరువీధిలో కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. ఈవో సింగల శ్రీనివాసమూర్తి  పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని