ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
రామకృష్ణ , చందు
డాబాగార్డెన్స్, న్యూస్టుడే: ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాణిపేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలం లింగాలవలస గ్రామానికి చెందిన రామకృష్ణ(19), విజయవాడకు చెందిన చందు(20) స్నేహితులు. చందు నగరంలోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. వారం రోజుల కిందట రామకృష్ణ అతని వద్దకు వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వారిద్దరు పాతనగరం లీలామహల్ థియేటర్ వైపు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన 108 అంబులెన్స్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై తుళ్లి పడిపోవడంతో తలలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావమైంది. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంçËనే అదే అంబులెన్సులో కేజీహెచ్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను కేజీహెచ్ శవాగారానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.
రామకృష్ణ చిన్నప్పుడే తల్లిదండ్రుల మృతి: రామకృష్ణ తలిదండ్రులు ఆరోగ్య సమస్యల కారణంగా అతని బాల్యంలోనే మృతి చెందారు. పెద్దనాన్న లుకలపు తౌడు(62) వద్ద పెరుగుతున్నాడు. రామకృష్ణ మృతి విషయాన్ని శ్రీకాకుళంలో ఉంటున్న తౌడుకు పోలీసులు తెలియజేశారు. చందు తల్లి పేదరాలు. కుమారుడి చనిపోయిన సమాచారాన్ని పోలీసులు ఆమెకు చేరవేశారు. అయితే ఆమె వద్ద ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో దారి ఖర్చుల కింద మహారాణిపేట పోలీసులు రూ.వెయ్యి పంపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశ్వక్రీడా వేడుక కోటి ఆశల్లో విశాఖ
[ 26-07-2024]
ప్రపంచమంతా పారిస్లో శుక్రవారం ఆరంభమయ్యే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వైపు చూస్తోంది. -
కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలు
[ 26-07-2024]
ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్-ముంబయి-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ప్రెస్కు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
చేతికి ఎముకే లేనట్టు.. అంతా కనికట్టు!!
[ 26-07-2024]
విశాఖలో గత వైకాపా ప్రభుత్వ పాలనలో ఇష్టా రాజ్యంగా టీడీఆర్లు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసి.. వైకాపా నేతలకు బాండ్లు కట్టబెట్టారు. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
[ 26-07-2024]
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
చురుగ్గా భారత్-యూఎస్ నేవీ విన్యాసాలు
[ 26-07-2024]
భారత్, యూఎస్ నౌకాదళాల మధ్య సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘రింపాక్-2024’ విన్యాసాలు సానుకూలంగా దోహదపడతాయని యూఎస్ కమాండర్, వైస్అడ్మిరల్ జాన్ ఎఫ్జీ వాడె అన్నారు. -
బాలికపై అత్యాచారం కేసులో 20ఏళ్ల జైలు
[ 26-07-2024]
బాలికను బలవంతంగా ఎత్తుకుపోయి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. -
వాహన సామర్థ్యం తనిఖీ ఇక ఆటోమేటిక్..
[ 26-07-2024]
వాహన సామర్థ్యాన్ని గుర్తించే ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. -
వీఎంఆర్డీఏ.. ప్రక్షాళన జరిగేనా!
[ 26-07-2024]
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నగరాభివృద్ధిని మెట్రోపాలిటన్ స్థాయికి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ)పై ఉంది. -
వంట.. తంటా!
[ 26-07-2024]
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. -
వంతెన నిర్మించాలంటూ జలదీక్ష
[ 26-07-2024]
సరియా గెడ్డపై వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ వాలాబు పంచాయతీ బొర్రచింత గిరిజనులు వాగులో దిగి గురువారం ఆందోళన చేపట్టారు. -
ఆరోగ్యకేంద్రం స్థలం ఆక్రమణకు యత్నం
[ 26-07-2024]
రెవెన్యూ అండ చూసుకుని ప్రైవేటు వ్యక్తులు పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థలాన్ని ఆక్రమించడానికి తెగించడం స్థానికులను విస్తుపోయేలా చేసింది. -
విస్సన్నపేట భూముల్లో అక్రమాలపై చర్యలేవి?
[ 26-07-2024]
విస్సన్నపేట భూములపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి నిబంధనలు అతిక్రమించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా, జనసేన నాయకులు గురువారం డిమాండ్ చేశారు. -
సింహాద్రి ఎన్టీపీసీకి రాజభాష గౌరవ్ సమ్మాన్ అవార్డు
[ 26-07-2024]
పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీకి 2023-24 సంవత్సరానికి గాను రాజభాష గౌరవ్ సమ్మాన్ ద్వితీయ అవార్డు వరించింది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్కు అంతరాయం
[ 26-07-2024]
భారీ లోడ్తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో గురువారం 16వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్