రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది.
మాట్లాడుతున్న ఎంపీపీ బోకం సూర్యకుమారి
సబ్బవరం, న్యూస్టుడే: సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. దీనికి ఎనిమిది అధికారులు డుమ్మా కొట్టారు. వీరిలో ఆర్అండ్బీ, తహసీల్దారు కార్యాలయం, టీ.ఆర్ఐ ఇంజినీర్, మండల పరిషత్ ఇంజినీర్, అటవీ శాఖ, ఆర్టీసీ సివిల్ సప్లై, రెవెన్యూ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖాధికారులు ఉన్నారు. వీరిపై ఎంపీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఆర్డబ్ల్యూఎస్ పనులు చేయడం పట్ల నారపాడు సర్పంచి మామిడి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవో రామ మోహన్నాయుడు స్పందిస్తూ ఇందుకు నిధులున్నాయని త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు.
- తవ్వవానిపాలెం జల్జీవన్ మిషన్ కింద అయిన మంజూరు, ఖర్చు, మిగులు వంటి వాటి గురించి చెప్పాలని సర్పంచి బోకం సోమునాయుడు నిలదీశారు. ప్రస్తుతం పని నిలిపివేయడానికి కారణమేంటని ఆయన ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ పి.జయలక్ష్మిని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా 20 కొళాయిలు వేయాల్సి ఉందని ఆమె బదులిచ్చారు.
- ఆదిరెడ్డిపాలెంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీటీసీ దేముడు బాబు కోరారు. మల్లునాయుడుపాలెంలో కూడా మంచినీటి కనెక్షన్లు ఇవ్వలేదని గొర్లె కనకరాజు ఫిర్యాదు చేశారు. పైడివాడ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫారంలు వేయాలని గత నాలుగు సంవత్సరాలుగా కోరుతన్నా అధికారులు పట్టించుకోలేదని సర్పంచి వడ్డాది అప్పలరాజు అన్నారు. దీనిపై ఏఈ వీరేంద్ర సమాధానం ఇస్తూ కొత్త ట్రాన్స్ఫారంలు పెట్టామన్నారు. కార్యక్రమానికి 20 మంది ఎంపీటీసీలకు 10మంది హాజరయ్యారు. ఎంపీడీవో ఎస్ రాంమోహన్నాయుడు, ఏవో బాబూరావు, వైస్ ఎంపీపీలు ఝాన్సీలక్ష్మీరాణి, చొక్కాకుల గోవింద పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్