వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
మహిళలు, బాలలకు రక్షణ కరవు
దశ లేని దిశ చట్టంతో బాధితులకు నిరాశ
పెందుర్తి, పరవాడ, వేపగుంట, సబ్బవరం, న్యూస్టుడే: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు మహిళల అదృశ్యం కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే వాటిని పట్టించుకునే పరిస్థితే కనిపించలేదు. మరోవైపు దిశ చట్టం చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆ చట్టం అమలులోకి తీసుకురావడంలో తీవ్రంగా విఫలమైంది. పోలీసులు బలవంతంగా ప్రజలతో దిశ యాప్ను డౌన్లోడ్ చేయించడంలో చూపిన శ్రద్ధ మహిళలకు భద్రత కల్పించడంలో చూపడం లేదన్న ఆరోపణలున్నాయి.
దిక్కులేని చట్టంగా మారింది
మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు కనిపించట్లేదు. దిశ చట్టం దిక్కులేనిదిగా మారింది. నగర శివారులో ఏర్పాటు చేసిన దిశ పోలీస్స్టేషన్కు వెళ్లాలంటే బాధితులు అవస్థలు పడాల్సి వస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లలో బాధితులను పట్టించుకోవడం లేదు.
యు.ఇందిర, జిల్లా కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం
ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు
దిశచట్టం పెట్టిందే తప్ప దానికి చట్టబద్ధత కల్పించŸలేదు. ఆడపిల్లలు, మహిళలు మీద దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని ప్రచారానికి వాడుకుంటోంది తప్ప పక్కాగా అమలు చేయలేకపోయింది.
అట్టా సన్యాసిఅప్పారావు, ఈ.భోనంగి
వైకాపా పాలనలో అధికం
రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు, దాడులు, వరకట్న వేధింపులు అధికమవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దిశచట్టం అమలు నిమిత్తం ఎటువంటి బడ్జెట్ కేటాయించలేదు.
పి.మాణిక్యం, జిల్లా ఐద్వా అద్యక్షురాలు
పూర్తిస్థాయి రక్షణ లేదు
దిశ చట్టం వచ్చినా ఇంకా మహిళలకు పూర్తిస్థాయి రక్షణ లేదు. దిశ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నా తగిన శిక్షలు వేయకపోవడంతో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
కావ్య, మహిళ
ఆకతాయిల చేష్టలు ఎక్కువయ్యాయి
వైకాపా పాలనలో అధికమంది గ్రామీణ ప్రాంత మహిళలు ఆకతాయిల చేష్టలకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
తాటిపాముల దుర్గారావు, సబ్బవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..