తెదేపాలోకి వలసల వరద
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు.
గంటా సమక్షంలో తెదేపాలో చేరిన కొవ్వాడ సర్పంచి, ఉప సర్పంచి, పద్మనాభం మండల వైకాపా సానుభూతిపరులు
మధురవాడ, పద్మనాభం, ఆనందపురం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. మాజీ మంత్రి భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో సోమవారం పద్మనాభం మండలం నుంచి పలువురు తెదేపాలో చేరారు. కొవ్వాడ సర్పంచి పి.రత్నం, ఉప సర్పంచి గౌరీ బాలశ్రీనివాస్, ఎనిమిది మంది వార్డు సభ్యులతో పాటు సుమారు వంద కుటుంబాలు గంటా చేతుల మీదుగా తెదేపా కండువాలు వేసుకున్నారు. మండల కేంద్రం పద్మనాభంకు చెందిన కో-ఆప్షన్ సభ్యుడు దున్న అబ్రహంతో పాటు మరో ఇరవై మంది పాస్టర్లు కూడా పార్టీలో చేరారు. వైకాపా విధానాలతో, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రవర్తనతో విసుగు చెంది చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో తెలుగుదేశంలో చేరినట్లు వారంతా పేర్కొన్నారు.
గంభీరం నుంచి: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు, మరో 20 కుటుంబాలకు చెందిన వారు కూడా తెదేపాలో చేరారు. ఈ మేరకు గంటా నివాసంలో గంభీరం తెదేపా నాయకుల సమక్షంలో మాజీ వార్డు సభ్యుడు, గ్రామ సచివాలయ కన్వీనర్ ఇల్లిపిల్లి ముసలయ్య, బంక వెంకటరమణ, అనుచరులు, కుటుంబీకులందరికీ గంటా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కోరాడ రాజబాబు, తెదేపా సీనియర్ నాయకుడు వానపల్లి ముత్యాలరావు, దుక్కవానిపాలెం తెదేపా నాయకులు పాల్గొన్నారు.
వైకాపా పాలనలో 7వ వార్డు పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విసుగు చెందిన మధురవాడ వాంబేకాలనీకి చెందిన 100 మంది వైకాపా కార్యకర్తలు ఆ పార్టీని వీడి గంటా సమక్షంలో తెదేపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం