నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం.
అక్కచెల్లెమ్మలకు విశాఖలో భద్రతేది జగన్!
ఉలిక్కిపడేలా ఘోరాల గణాంకాలు
ఈనాడు- విశాఖపట్నం
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుని పెద్దపీట వేస్తున్నాం.
ఇదీ జగన్ మహిళల భద్రతపై గొప్పగా చెప్పిన మాటలు
... ఇవన్నీ ప్రచార ఆర్భాటానికే తప్ప, ఆడపిల్లలపై అకృత్యాలను అడ్డుకోలేకపోయాయి. అక్కచెల్లెమ్మలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. విశాఖలో పట్టపగలే మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. ‘వన్ స్టాప్’ కేంద్రంలో నమోదవుతున్న గణాంకాలు ఆడబిడ్డల భద్రతను ప్రశ్నిస్తున్నాయి. గృహ హింస, అత్యాచారం, మహిళల చిత్రాలను అంతర్జాలంలో పెట్టి బెదిరింపులు, అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు వైకాపా హయాంలో పెరిగిపోయాయి. కఠిన చర్యలు తీసుకుంటే సీఎం జగన్ పాలనలో ఇన్ని జరిగేవా అని జనం ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖులకే రక్షణ లేదు: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడికే రక్షణ కరవైంది. గతేడాది జూన్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎంపీ కుమారుడు శరత్ ఇంట్లోకి చొరబడ్డారు. శరత్ను కిడ్నాప్ చేసి, సినీ ఫక్కీలో ఫోన్లో మాట్లాడిస్తూ ఎంపీ సతీమణి జ్యోతి, ఆడిటర్ జీవీని ఆ ఇంటికి పిలిపించి నిర్బంధించారు. ఎంపీ భార్య వద్ద ఆభరణాలు దోచుకోవడమే కాకుండా, చేయిచేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లు మూడు రోజులు గంజాయి మత్తులో ఉండి విచక్షణారహితంగా బాధితులను కొట్టి హింసించారు.
ప్రశాంత విశాఖలో ఎంపీ కుటుంబానికే భద్రత కరవైన పరిస్థితులు తీవ్ర చర్చనీయాంశ మయ్యాయి. జగన్ రుషికొండలో నిర్మించిన రాజసౌధానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. గతేడాది రాత్రి సమయంలో ఇంటికి వస్తున్న మహిళా కమిషన్లోని ఓ సభ్యురాలి సోదరిపై మద్యం మత్తులో ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించడం ఉలిక్కిపడేలా చేసింది. ఇటీవల ఓ కీలక నేత ఇంట్లోకి చొరబడి ఆయన సతీమణి గొంతుపై కత్తిపెట్టి నగలు తీసుకెళ్లిన ఘటన కూడా కలకలం రేపింది.
అమ్మో ఎన్ని ఘటనలో
గతేడాది మే 30న ఓ వివాదాస్పద భూమిలో కాపలాదారుగా పనిచేస్తున్న మహిళను కొందరు బలవంతంగా బయటకు లాక్కొచ్చి షెడ్డు కూల్చేశారు. ఆమెను నిర్బంధించి ఫోన్ లాక్కొని తెల్లవారుజాము వరకు భయ భ్రాంతులకు గురి చేశారు.
నేవీ అధికారి కుమార్తెపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 9వ తరగతి చదువుతున్న బాలిక నగ్న వీడియోలు తీసి బెదిరించి ఓ అటెండర్ అత్యాచారం చేశారు. ఆ వీడియోలు స్నేహితులకు చేరవేయగా, వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు. అటెండర్ను అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘోరమైన ఘటన గతేడాది జులైలో వెలుగులోకి వచ్చింది.
గతేడాది ఫిబ్రవరి 19న అర్ధరాత్రి రంగిరీజు వీధిలో ఓ కుటుంబం వెళుతుండగా.. గంజాయి మత్తులో కొందరు యువకులు మహిళ దుస్తులు చింపి క్రూరంగా ప్రవర్తించారు.
- 2019 డిసెంబరులో కొమ్మాదిలోని వికలాంగులకాలనీలోఅద్దెకు ఉంటున్న వ్యక్తికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఒక రోజున ఇంటికి పిలవగా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో ఆ వ్యక్తి...మహిళను హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కేశాడు. ఏడాదిన్నర తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.
- భీమిలి పరిధిలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే కేరళకు చెందిన వ్యక్తి అత్యంత కిరాతంగా ఓ మహిళను హత్య చేశాడు. తనకు పరిచయం ఉన్న మహిళతో గొడవ జరగ్గా... భవనం పైనుంచి తోసేశాడు. కిందపడిన ఆమె కొన ఊపిరితో ఉండటంతో గొంతు నొక్కడంతోపాటు, శరీరంపై పలుచోట్ల కత్తితో గాయాలు చేసి చంపి నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు.
తగరపు వలసకు చెందిన ఓ మహిళకు ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఓ రోజు ఆటోలో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా, తన ఒంటిపై ఉన్న బంగారం కొంత ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆ మహిళను హత్య చేసి గెడ్డలో పడేశాడు.
నగరంలో నిఘా ఏదీ:
మద్యం, గంజాయి మత్తులో మహిళలపై కొందరు పట్టపగలే దాడులకు తెగబడుతున్నారు. బహిరంగంగానే బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నా నిఘా కళ్లు పసిగట్టలేకపోతున్నాయి. మహిళలపై వేధింపులు...వారిపై కత్తులతో దాడులు జరుగుతున్నా నిరోధించలేక పోతున్నారు. ఘటనల తీరును పరిశీలించాలన్నా నగరంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు మూలకు చేరిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..