జగనన్న వస్తే తప్పని తిప్పలు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు.
మండుటెండలో జనానికి అగచాట్లే..
ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్ద బస్సు నుంచి కిందికి దిగుతున్న జగన్
పీఎంపాలెం, ఆనందపురం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. ఈ క్రమంలో వైకాపా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జీవీఎంసీ 5, 6, 7, 8 వార్డుల నుంచి ఆటోలు, బస్సుల్లో జనాన్ని 8 గంటలకే స్టేడియం వద్దకు తరలించారు. వీరికి పార్టీ జెండాలు, టోపీలు, టీషర్టులు ఇచ్చి రోడ్లకు ఇరువైపులా నిలబెట్టారు. జనసమీకరణ సరిగ్గా లేదన్న సమాచారంతో జగన్ శిబిరం నుంచి సమయానికి బయలు దేరలేదు. దీంతో ఎండకు తాళలేక వచ్చిన కొద్ది మంది పరిసరాల్లో నీడ కోసం నానా పాట్లు పడ్డారు.
స్టేడియం ఎదురుగా ఉన్న షాపింగ్మాల్ వద్దకు ఎక్కువ మంది పరుగులు తీశారు. అది గమనించిన నాయకులు జగన్ వస్తున్నారంటూ వారిని బలవంతంగా తీసుకు వచ్చి మళ్లీ ఎండలో నిల్చోబెట్టారు. ఎంత ఎదురు చూసినా జగన్ బయటకు రాకపోవడంతో జనం చెట్లు, బస్సులు, ఆటోల పక్కన నీడ కోసం వెదుక్కోవాల్సి వచ్చింది. నేతలు చెబుతున్నా కొందరు వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు సీఎం ఎప్పుడు బయలుదేరుతున్నారో తెలియక పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు నిలిపి వేయడంతో మండుటెండలో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూడలిలో వాహనాలను అరగంటకు పైగా కదలనీయకుండా చేయడంతో సహనం కోల్పోయిన వాహనదారులు హారన్లు కొడుతూ నిరసన తెలియజేశారు. పేర్కొన్న సమయానికి రెండు గంటలు ఆలస్యంగా స్టేడియం వద్దకు వచ్చిన జగన్ ఉన్న కొద్ది పాటి జనానికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. కారుషెడ్డు, మధురవాడ, కొమ్మాది, మారికవలస, బోయపాలెం కూడళ్లలో సైతం జన స్పందన లేకపోవడంతో బస్సులోపలి నుంచే చేతులూపుతూ వెళ్లిపోయారు. అనంతరం ఆనందపురం మండలం పెద్దిపాలెంలో జరిగిన వైకాపా సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో జగన్ పాల్గొన్నారు.
స్టేడియం వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం