పునరావాసం.. పచ్చి మోసం
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది.
అయిదేళ్లుగా హామీలతోనే కాలయాపన
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. నిలువ నీడ లేకుండా పోయినవారిని నిలువునా ముంచేస్తోంది. ఉన్న ఊరిని పోగొట్టుకొని, ఉపాధిని కోల్పోయి.. నిస్సహాయలుగా మిగిలిన నిర్వాసితుల గోడు గాలికొదిలేసింది. నేనున్నానంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు వీరి విషయంలో ఉత్తుత్తి వాగ్దానాలుగా మిగిలిపోయాయి.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 26 గ్రామాల పరిధిలోని భూములను సేకరించి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు ఇంటి స్థలాలు, ఆర్అండ్ఆర్ పరిహారం పూర్తిస్థాయిలో అందలేదు. ఇంకా 700 మందికి, వారి పిల్లలకు పరిహారం, ఇంటి స్థలాలు కేటాయించలేదు. నిర్వాసితుల పునరావాసం కోసం దిబ్బపాలెంలో సెజ్ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో వసతుల మెరుగుపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదు. సరైన మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సదుపాయం లేదు. ఆర్భాటంగా రూ. 1.10 కోట్లతో తాగునీటి పథకాన్ని నిర్మించిన ప్రస్తుత ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు కనీసం నెలరోజుల వరకైనా గోదావరి జలాలను కాలనీకి సరఫరా చేయలేక చతికిలపడ్డారు.
10 శాతమైనా న్యాయం చేయలేదు
నక్కపల్లి, న్యూస్టుడే: నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమిత్తం తీరప్రాంతాన్ని ఆనుకుని ప్రభుత్వ, జిరాయితీ, డీఫాô భూములు కలిపి సుమారు 4300 ఎకరాలు సేకరించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో సుమారు 90 శాతం రైతులకు పరిహారం చెల్లించారు. అంతేకాకుండా స్టార్టప్ ఏరియా కోసం 1150 ఎకరాలు సిద్ధం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరవాత మిగిలిన సమస్యలు పరిష్కరించి, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టిపెడుతుందని భావించినా, ఒరిగిందేమీ లేదు. దీనికి తోడు నిర్వాసితులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినా, పెద్దగా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని బాధితులంతా డిమాండు చేస్తుంటే, కేవలం ఇళ్లు కోల్పోయిన వారికి మాత్రమే పునరావాసం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మాట తప్పనన్నారు.. నాలుక మడత పెట్టేశారు..
నేనున్నానన్నారు.. నట్టేట్లో ముంచారు..
ఆదుకుంటామన్నారు.. ఆపదలోకి తోసేశారు..
పరిహారమిస్తామన్నారు.. పరిహాసం చేశారు..
తెదేపా హయాంలో అలా.. జగన్ పాలనలో డీలా ... గతంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు ప్యాకేజీ అందించే తేదీని 2004 నుంచి 2010కి మార్చి వారికి మర్చిపోలేని మేలు చేసింది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కాదన్న వితంతు మహిళలకు సైతం పరిహారం, ఇంటిస్థలం అందించాలని నిర్ణయం తీసుకొని అమలు చేసింది. మేజర్ మగపిల్లలు, మేజర్ ఆడపిల్లలకు సమానంగా 5 సెంట్లు ఇంటిస్థలం, రూ. 1.75 లక్షల పరిహారం అందించి వందలాది కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. దిబ్బపాలెం సెజ్ కాలనీలో తారురోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందాన తయారైంది.
పరిష్కారం కాని సమస్యలెన్నో... పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పిస్తామంటూ చట్టం చేసిన జగన్ ప్రభుత్వం అచ్యుతాపురం సెజ్లో మాత్రం అమలు చేయలేదు. సెజ్ కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న దుప్పితూరు గ్రామం తరలింపును ఈ ఐదేళ్లుగా ప్రభుత్వం నానుస్తూనే ఉంది. తమ గోడు పట్టించుకోవాలంటూ స్థానికులు దీనిపై మంత్రులు, అఖిలభారత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సెజ్ ఏర్పాటుతో తీవ్ర ప్రభావానికి గురైన పూడిమడక గ్రామస్థులు, మత్స్యకార యువతకు ఉపాధి దక్కలేదు. నిర్వాసితులకు కనీసం బస్సు సౌకర్యం లేకుండా పోయింది.
పరిహారం, ప్యాకేజీ చెల్లించాలంటూ నిర్వాసితుల ఆందోళన (పాత చిత్రం)
కార్యాలయాన్నీ తరలించేశారు... నిర్వాసితుల సమస్యలు పరిష్కారం మాటెలా ఉన్నా ఆర్అండ్ఆర్ ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగడానికి అన్నదాతల కాళ్లరుగుతున్నాయి. అర్హులైన వారికి ఇంటిస్థలాలు, పట్టాలు అందివ్వడానికి వీలుగా గతంలో ఏపీఐఐసీ వన్స్టాప్ కార్యాలయంలో ఈ కార్యాలయం నడిచేది. వైకాపా ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేసింది. రెండు మండలాల పరిధిలో 9297 ఎకరాల సెజ్ స్థలానికి సంబంధించిన వేలాది మంది నిర్వాసితులు జిల్లాలో ఉన్న ఎస్డీసీ కార్యాలయానికి వరుస కడుతున్నారు.
-ఈనాడు, అనకాపల్లి,
న్యూస్టుడే,
అచ్యుతాపురం
రెండు మండలాల్లో 26 గ్రామాల నిర్వాసితులకు
ఏర్పాటు చేసిన దిబ్బపాలెం సెజ్ కాలనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు