తేలని భూసారం.. సాగు నిస్సారం..!
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి.
అయిదేళ్లగా నిలిచిన మట్టి నమూనా పరీక్షలు
ఖరీఫ్ వస్తున్నా కానరాని సన్నద్ధత
ఈనాడు, అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలి. గతంలో ప్రభుత్వమే ఏటా లక్ష్యాలను విధించి మట్టి నమూనాలను సేకరించి, పరీక్షలు చేసి ఫలితాలను కార్డుల రూపంలో రైతులకు అందజేసేది. దీంతో రైతులకు ఎంతోకొంత అవగాహన కలిగి పంటల సాగు విధానంలో మార్పులు చేసుకునేవారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాది మట్టి పరీక్షలు చేయలేదు. ఈ ఏడాది 10 వేల మట్టి నమూనాలు సేకరించినా వాటిని పరీక్షించడానికి అవసరమైన రసాయనాలు లేవు. సర్కారు బడ్జెట్ విడుదల చేస్తేగానీ వాటిని పరీక్షించి రైతులకు భూసార కార్డులు అందించే పరిస్థితి లేదు. తొలకరి జల్లులు జిల్లాను పలకరించబోతున్నా భూసారం తెలీక రైతులు అయోమయానికి గురవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని అనకాపల్లిలో ప్రధాన భూసార పరీక్ష కేంద్రంతో పాటు నర్సీపట్నం, పాడేరులలో కూడా రెండు కేంద్రాలుండేవి. విశాఖపట్నంలో సంచార భూసార ప్రయోగశాలను నడిపేవారు. ఏటా 30 వేలకు పైగా మట్టి పరీక్షలు నిర్వహించేవారు. ఓసారి మట్టి పరీక్ష చేయిస్తే మూడేళ్ల వరకు వాటి ఆధారంగానే ఎరువుల వినియోగం, పంటల సాగు చేయొచ్చు. జిల్లాలో ఆఖరిసారిగా 2018-19లో మట్టి పరీక్షలు చేశారు. ఆ తర్వాత నుంచి వాటి జోలికిపోలేదు. గత ప్రభుత్వం భూసార పరీక్షలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి 25 ఎకరాలను ఒక యూనిట్గా తీసుకుని మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేయించింది. వైకాపా ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి భూసార పరీక్షలు నిలిచిపోయాయి. 2019లో కేంద్రం కృషి కల్యాణ్ అభియాన్ ద్వారా అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రంలో ఏడు వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయించి చేతులు దులిపేసుకుంది.
శిక్షణ పొందుతున్న వ్యవసాయ శాఖ సిబ్బంది
అతిగానే ఎరువుల వినియోగం
జిల్లాలో వరి, చెరకు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వరికి ఎకరాకు 32 కేజీలు నత్రజని వేయాల్సి ఉండగా 67 కేజీలు వాడుతున్నారు. అదే విధంగా చెరకు పంటకు 45 కేజీలు అవసరం, 101 కేజీలు వేస్తున్నారు. ఇలా అధిక నత్రజని వినియోగించడంతో ఎన్నో నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. భూసారం దెబ్బతినడమే కాకుండా, పెట్టుబడులు పెరిగిపోయి రైతులు నష్టపోతున్నారు. భూసారం తెలిస్తే వీటి వినియోగంలో కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మట్టి పరీక్షలు చేయాల్సి వస్తే ఏప్రిల్, మే నెలల్లోనే నమూనాలను సేకరించాలి. తర్వాత వ్యవసాయ సీజన్ మొదలైపోతుంది. పరీక్షలు చేసినా ఫలితాలు అందడంలో జాప్యం తప్పదు.
ప్రయోగశాలలున్నా.. పరీక్షలు సున్నా..
చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, మాడుగులలో వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ల్యాబ్ను రూ.60 లక్షల ఖర్చుతో నిర్మించారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో రూ.3 కోట్లుతో జిల్లా స్థాయి ప్రయోగశాల నిర్మించారు. వీటిలో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు అంతగా ప్రయోజనం ఉండటం లేదు. ఎక్కువ మంది రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచే విత్తనాలు కొనుగోలు చేస్తారు. తిరిగి వాటిని పరీక్షలు చేయించడం లేదు. ఈ ల్యాబ్ల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని ఎప్పటి నుంచో రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ఏడాది ల్యాబ్లో పరీక్షలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అయితే అందుకు అవసరమైన రసాయనాలు లేకపోవడంతో ఒక్క ప్రయోగశాలలో కూడా మట్టి పరీక్షలు చేయలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత