ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలు.. రూ.కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.
పాడేరు, నక్కపల్లి, న్యూస్టుడే
కాగిత వద్ద పట్టుకున్న భారీ నగదు చూపుతున్న పోలీసులు
నక్కపల్లి, న్యూస్టుడే: ఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి రాక ముందు నుంచే నక్కపల్లి మండలం కాగిత వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేశారు. మిగతా అన్ని చోట్లా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండా అక్రమంగా తరలించే నగదు, మద్యం, గంజాయి తదితర వాటిని పట్టుకున్నారు. జిల్లాలో చెక్పోస్టుల పనితీరును కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ పలుమార్లు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ తనిఖీల్లో భాగంగా 1040 కేసులు నమోదు చేసి, 1273 మందిని కటకటాల్లోకి పంపారు. దాదాపు రూ. 3.89 కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. కాగిత టోల్గేట్ వద్ద తనిఖీల ద్వారా పోలీసులు రూ.2.07 కోట్ల నగదు పట్టుకున్నారు. దీనికి ఏ ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ రెండు నెలల్లో పట్టుకున్న దానికి ఇది అదనం. ఎలమంచిలి మండలం సోమలింగంపాలెం వద్ద గడ్డివాములో దాచిన రూ. 49 లక్షలకుపైగా విలువైన 39 వేల పైచిలుకు మద్యం సీసాలను పట్టుకున్నారు. దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో గంజాయి, మద్యం, ప్రలోభాలకు గురి చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఎలమంచిలి మండలం సోమలింగపాలెం వద్ద గడ్డివాములో దాచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
తనిఖీల ముఖచిత్రం
- చెక్పోస్టులు: 29
- నాటుసారా, పులుపు: 215 కేసులు, 1.28లక్షల లీటర్లు, విలువ రూ. 88.71 లక్షలు, 99 మంది అరెస్టు
- మద్యం: 669 కేసులు, 9833 లీటర్లు, రూ. 78.14 లక్షల విలువ, 679 మంది అరెస్టు
- గంజాయి: 21 కేసులు, 1186 కేజీలు, రూ. 64.49 లక్షల విలువ, 41 మంది అరెస్టు
- జూదం: 105 కేసులు, నగదు రూ. 12.75 లక్షలు, 454 మంది అరెస్టు
- నగదు: 19 కేసులు, రూ. 1,18,95,780
- ప్రలోభాలు: 11 కేసులు, రూ. 19.73 లక్షల విలువ
- బీ బంగారం (9.83 గ్రాములు), వెండి (7.31కేజీలు): 1 కేసు, రూ. 7.06 లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం