సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు.
సంగీత శిక్షణపై బాలల్లో మక్కువ
అనకాపల్లిలో వేసవి శిక్షణ శిబిరాలు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
గిటార్ సాధనలో పిల్లలు
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన సంగీత సాధన నేడు పట్టణాలకూ విస్తరించింది. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు నృత్యం, గిటార్, పియానో, గీతాలు ఆలపించడం, చిత్రలేఖనంలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ దొరికిన సమయాన్ని వినియోగించుకుంటున్నారు. గతంలో వేసవి సెలవులు దొరికితే ఆటపాటలతో కాలం గడిపే విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా తగిన ప్రణాళిక వేసుకుంటున్నారు. సెలవుల్లో ఆడుకుంటునే తమ అభిరుచులకు అనుగుణంగా శిక్షణ తరగతులను వినియోగించుకుంటున్నారు. అనకాపల్లిలో సంగీత సాధనకు సంబంధించిన శిక్షణ తరగతులను మే 1 నుంచి జూన్ 10 వరకు నిర్వహిస్తున్నారు.
నృత్య సాధనలో ఉత్సాహంగా..
తమ్ముడితో కలిసి..
నేను ఆరో తరగతి. మా తమ్ముడు నాలుగో తరగతి. వేసవిలో సంగీత శిక్షణ ఇస్తున్నారని ఇక్కడికి వచ్చాం. ప్రతి రోజూ నృత్య సాధన చేస్తున్నాం. మెలకువలు నేర్పుతున్నారు.
ఆర్.సూర్యమిత్, రోషన్ సుభాష్
పాశ్చాత్య నృత్యంపై ఆసక్తి..
వేసవి సెలవులు వృథా కాకుండా సంగీత సాధనలో చేరాను. పాశ్చాత్య నృత్యం నేర్చుకుంటున్నా. వేసవిలో ఈ అవకాశం లభించడం ఆనందంగా ఉంది. పాఠశాలలు ఉన్నప్పుడు అవకాశం ఉండదు. సరైన సమయంలో శిక్షణ ఇవ్వడం బాగుంది.
కె.శ్రీజ, ఆరో తరగతి విద్యార్థిని
పియానో నేర్చుకుంటున్నా
నాకు పియానో అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలని ఉన్నా నేర్పించే వారు లేకపోవడంతో నిరాశ కలిగేది. వేసవి శిక్షణలో భాగంగా అనకాపల్లిలో నేర్పిస్తున్నారని చేరాను. ఇక్కడ తర్ఫీదు పొందుతా!
ఎన్.తన్వీర్
శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది..
నాకు గిటార్ అంటే చాలా ఇష్టం. ఇందులో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి సెలవుల్లో ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్న సమయంలో సంగీత సాధనపై శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని ఇక్కడ చేరాను. సంగీతంలో అందిస్తున్న శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది.
అనూష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి