సొమ్ములు పోశారు.. కళ్లప్పగించారు!!
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు.
రైతుబజార్లలో మూతపడ్డ శీతల గిడ్డంగులు
పట్టించుకోని అధికారులు
సామగ్రి పెట్టేందుకే ఉపయోగపడుతున్నాయ్
ఈనాడు, విశాఖపట్నం
ఎంవీపీ కాలనీ బజారులోని గిడ్డంగుల వద్ద వాహనాల పార్కింగ్ ఇలా..
రైతు బజార్లలో భారీగా ఖర్చు చేసిన పరికరాలు ఒక్కసారి మూలుకు చేరితే చాలు... వాటి సంగతి ఇక అంతే. బాగు చేద్దాం.. అందుబాటులోకి తెద్దాం అనే ఆలోచనే అధికారులకు లేదు. మార్కెటింగ్శాఖ నిర్లక్ష్యంతో అటు రైతులు... ఇటు వినియోగదారులు ఎన్నో ప్రయోజనాలకు దూరమవుతున్నారు.
తాజా పండ్లు, కూరగాయలు వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో పది టన్నుల సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులను గోపాలపట్నం, ఎంవీపీ కాలనీల్లోని రైతుబజారుల్లో నిర్మించారు. కొద్ది రోజులు బాగానే వాటి నిర్వహణ సాగింది. తరచూ వస్తున్న సమస్యలను అధిగమిస్తూ వచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పూర్తిగా వాటిని గాలికొదిలేశారు. ఎంవీపీ కాలనీలోని గిడ్డంగిలో శీతల యంత్రం పనిచేయడం లేదు. ఇతర సాంకేతిక సమస్యలు కొన్ని తలెత్తడంతో దాన్ని పట్టించుకోలేదు. విద్యుత్తు నిర్వహణ సక్రమంగా చేపట్టలేదు. ఏసీ యూనిట్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కూరగాయలు నిల్వ చేయాల్సిన చోట రైతులు కూరగాయలు తెచ్చే సామగ్రి ఉంచుతున్నారు. వాహనాల పార్కింగ్కు వాడుతున్నారు. గోపాలపట్నంలోని శీతలగిడ్డంగిదీ అదే పరిస్థితి. ఈ గదులు ఎక్కువ సరకు నిల్వ చేసేందుకు వీలు లేక రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
శీతల గిడ్డంగిలో రైతులు ఉంచిన సామగ్రి
కేంద్రీకృతంగానైనా..
నగరంలో 13 రైతుబజార్లు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు 1500 మందికిపైగా రైతులు నిత్యం కూరగాయలు విక్రయిస్తుంటారు. వీరిలో సగం మందికి పైగా రైతులు సమీప గ్రామాల నుంచి ఆకుకూరలు, కూరగాయలు తీసుకొస్తారు. మిగిలిన వారిలో ఎక్కువ మంది దుంపలు, ఉల్లి, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, క్యాబేజీ, కాలీఫ్లవర్, అల్లం, అరటి వంటి రకాలను ఇతర ప్రాంతాలను నుంచి కొనుగోలు చేసి తెస్తారు. ఈ సందర్భాల్లో లారీల్లో వచ్చిన సరకు నిల్వకు అనువైన శీతల గిడ్డంగులు లేక ఆరుబయటే ఉంచేస్తున్నారు. అప్పటికే ఎండకి ఎండి, వానకి తడిచిన సరకు సరైన నిల్వ సదుపాయం లేక మరింత పాడవుతోంది. దీంతో రైతులు సైతం నష్టపోవాల్సి వస్తోంది. సీతమ్మధార, పెందుర్తి, నరసింహనగర్ , మధురవాడ ఇలా ..అన్ని చోట్ల నిర్మించడం కుదరకపోయినా కేంద్రీకృతంగా కొన్నిచోట్లయినా ఏర్పాటు చేస్తే వినియోగించుకుంటామని రైతులు అంటున్నారు.
పాడైన ఏసీ యూనిట్లు
ఎంవీపీ కాలనీలో పండ్లను మగ్గబెట్టేందుకు ఏర్పాటు చేసిన రైపనింగ్ కేంద్రం పనిచేయడం లేదు. దాదాపు అయిదేళ్ల క్రితమే మూలకు చేరింది. కనీసం డిమాండు సమయంలోనైనా అందుబాటులోకి తీసుకురాలేదు. ఏటా దీనిని అందుబాటులోకి తెస్తారనే ఎదురుచూపులే మిగిలాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే