మెట్ల మార్గానికి మోక్షమెప్పుడో!
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు.
శిథిలావస్థకు చేరడంతో భక్తుల అవస్థలు
కొత్త మార్గానికి తప్పని ఎదురుచూపులు
ప్రసాద్ పథకంలో కనిపించని ప్రాధాన్యం
దేవాదాయ, పర్యాటక శాఖల సమన్వయ లోపం
ఈనాడు, విశాఖపట్నం
శిథిలావస్థకు చేరిన మెట్ల మార్గం ప్రమాదకరంగా ఇలా..
సింహాచలం కొండ మీదకు వెళ్లే మెట్ల మార్గం శిథిలావస్థకు చేరింది. స్వామి దర్శనానికి వెళ్లే ఈ ప్రత్యామ్నాయ మెట్ల మార్గానికి కొన్నేళ్లుగా మోక్షం కలగడం లేదు. కనీసం ప్రసాద్ పథకంలో భాగంగానైనా ప్రాధాన్యంగా చేస్తారంటే అదీ కనిపించడం లేదు. అధికారులు అదిగో, ఇదిగో అంటున్నారే తప్ప అటువైపే చూడడం లేదు. భక్తులు జారి పడిపోతున్నా పట్టడం లేదు. మీద నుంచి బండలు జారి ఇబ్బందులు పడుతున్నా పనులు వేగవంతం చేయలేదు. వర్షాకాలం వచ్చిందంటే బితుకుబితుకుమంటూ వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ రాయి వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. ప్రసాద్ పథకం కింద ఇప్పటికే ఆలయం వద్ద పనులు ప్రారంభించారు. మెట్ల నిర్మాణ పనులను ప్రాధాన్యంగా తీసుకొని భక్తుల సౌకర్యార్థం నిర్మించాల్సినప్పటికీ ఆ దిశగానే ఆలోచన చేయడం లేదు. దేవాదాయ, పర్యాటక శాఖల సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారుతోంది.
అప్పట్లో మంత్రి చెప్పినా..
గత ఏడాది దేవాదాయ శాఖ మంత్రి మెట్ల మార్గం నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహస్యంగా ఫొటోలు తీయించి అధ్వానంగా ఉన్న తీరుపై అప్పట్లో అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత కొద్ది రోజులు సక్రమంగా నిర్వహించి ఆ తరువాత గాలికొదిలేశారు. ఇప్పటికైనా ఈ మెట్ల మార్గానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. బొట్లు పెట్టి మొక్కులు చెల్లించుకోవడానికి చాలామందికి వీలు కుదరడం లేదు.
అసంపూర్తిగా కొత్త మార్గం
ప్రమాదకరంగా..
ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన మెట్లు ప్రమాదకరంగా మారాయి. తొలిపావంచా నుంచి కొండ మీదకు వెళ్లే వరకు అలానే ఉన్నాయి. కొన్ని చోట్ల పట్టు తప్పితే కొండ కిందకు జారిపోయేంత ప్రమాదంగా ఉన్నాయి. శిథిలమైన వాటికి తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టలేదు. అక్కడక్కడ బండరాళ్లు పట్టుతప్పేలా కనిపిస్తున్నాయి. ఆంజనేయస్వామి గుడి, కొండ ధారల వద్ద మెట్లు సక్రమంగా లేవు. కొండ అంచుల వద్ద రక్షణ పలకలు లేవు.
కొండ మీద అన్నదానం, ఇతర క్యాంటీన్లలో వినియోగించిన మురుగు నీరు కొండ మధ్యలోకి వచ్చేసరికి మెట్ల మీదుగా పారుతోంది. అక్కడికి వచ్చేసరికి దుర్వాసనతో భక్తులు ముక్కులు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. వర్షం కురిస్తే ఆకాశధార నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే మార్గం బురదమయమైపోతుంది. తరచూ అక్కడ చాలామంది జారిపడుతుంటారు.
కొత్త మార్గం మధ్యలోనే..
ఏటికేడు పెరుగుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గానికి ఆనుకొని కొత్తగా మరో మెట్ల మార్గానికి గతంలో చర్యలు తీసుకున్నారు. గిర ప్రదక్షిణ, చందనోత్సవం, ప్రత్యేక రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడం, పాత మార్గం కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరడంతో దీని ఆవశ్యకతను గుర్తించి ఆ వెంటనే ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. నిధుల సమస్య కారణంగా పూర్తిచేయలేకపోయారు.
మెట్ల మార్గం విస్తరణకు కొన్నేళ్ల కిందటే పూనుకున్నారు. తొలిపావంచా నుంచి కొండపైన సింహగిరి బస్స్టాండు వరకు ఈ మార్గాన్ని విస్తరించాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పాత మెట్లను ఆనుకొని మరో 20 అడుగుల వెడల్పుతో సుమారు వెయ్యికి పైగా నిర్మించాలని భావించారు. అంతేకాకుండా మధ్యలో ఆంజనేయస్వామి గుడి ఆధునికీకరణ, విశ్రాంతి ప్రాంగణం నిర్మాణం, దానికి మరికొంత దూరంలో చాకిధారను అభివృద్ధి చేయాలనుకున్నారు. ఈ ప్రతిపాదనలతో రూ.8 కోట్లకు టెండరు పిలిచి పనులు ప్రారంభించారు. ఆ పనులు ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోయాయి. పూర్తిస్థాయిలో 60 మెట్లు మాత్రమే పూర్తయ్యాయి. తొలిపావంచా నుంచి కొంతవరకు కాంక్రీట్ వేసి వదిలేశారు.
ప్రసాద్ పథకంలో భాగంగా ఈ మెట్ల మార్గాన్ని త్వరితగతిన పునర్నిర్మిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. పాత మెట్లకు మరమ్మతులతో పాటు కొత్త మెట్ల మార్గాన్ని పూర్తిస్థాయిలో నిర్మించాలని కోరుతున్నారు. ఆంజనేయస్వామి ఆలయం పరిసరాలను పూర్తిగా నవీకరించాలని అడుగుతున్నారు. మిగిలిన పనులను పక్కనపెట్టయినా వీటిని చేయమని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?