‘చంద్రబాబే ముఖ్యమంత్రి!.. ఫలితాల తర్వాత వైకాపా కాలగర్భంలోకి..’
తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
ఎంపీ రఘురామ కృష్ణరాజు
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజు.. చిత్రంలో ఉత్తరం నియోజకవర్గ
భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ రఘువర్మ తదితరులు
గురుద్వారా, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. మంగళవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన సీతమ్మధార కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్ 4వ తేదీన వైకాపా నాయకులు కనబడరని జోస్యం చెప్పారు. దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే ఆ పార్టీకి 50 సీట్లు.. లేకుంటే 25 మాత్రమే వస్తాయని తెలియజేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని, దేవుడు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు. ఉండి నియోజకవర్గంలో 30 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు. జగన్ జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడలేదని, అవి ఎక్కడికి వెళ్లాయో అతనికే తెలియాలని ఆరోపించారు. జూన్ 4వ తేదీన వైకాపా కాలగర్భంలోకి కలిసిపోతుందని, ఆరోజు మధ్యాహ్నం నుంచి ఆ పార్టీ నాయకులకు అల్లర్లు చేయడానికి ఓపిక ఉండదని పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కావాలనే కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని.. చీఫ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తే బాగుండేదని విమర్శించారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుషికొండ నిర్మాణాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. జగన్ సభలకు వచ్చిన వారంతా అభిమానం మీద రాలేదని బలవంతంగా తీసుకొచ్చారని విమర్శించారు. సమావేశంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం భాజపా అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ రఘువర్మ, తెదేపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఎండీ నజీర్, భాజపా నాయకులు పరశురామరాజు, సురేశ్బాబు, పృధ్వీరాజ్, ఆళ్ల శ్రీనివాస్, పీస్ఎన్ రాజు, బుద్ధరాజు శివాజీ, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు