నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య సేవలు నిలిపివేయాలని జిల్లాలోని 14 నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి.
జిల్లాలో రూ. 42.56 కోట్ల బకాయిలు
బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య సేవలు నిలిపివేయాలని జిల్లాలోని 14 నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈమేరకు అనకాపల్లిలోని ఉషాప్రైమ్ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ట్రస్టు, జిల్లా వైద్య అధికారులకు నోటీసులు ఇచ్చింది. దీంతో సేవలు నిలిచిపోతాయని రోగుల్లో ఆందోళన నెలకొంది.
కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రారంభంలో మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చామని, వ్యయ పరిమితి రూ. 25 లక్షలు వరకు పెంచామని జగన్మోహన్రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవానికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ పథకానికి తూట్లు పొడుస్తోంది. ఆసుప్రతులకు బకాయిలు చెల్లించకపోవడంలో ఏళ్ల తరబడి తీవ్ర అలసత్వం వహించింది. ప్రచార ఆర్భాటాలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం గమనార్హం.
జిల్లాలో 5,04,902 ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఉన్నారు. నెట్వర్క్ పరిధిలో 14 ఆసుపత్రులు ఉండగా వీటిలో ప్రైవేటు రంగానికి చెందినవి ఆరు, ప్రభుత్వ రంగ పరిధిలో ఎనిమిది ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో రోజుకు సుమారు 800 మంది వరకు వైద్య సేవలు పొందుతుండగా, 150 వరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 24,045 మంది వరకు రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందారు. ఎక్కువ మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ ఆసుపత్రులకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. వైద్య పరికరాలు, మందుల కంపెనీలకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని నెట్ వర్క్ ఆసుపత్రులు చేతులెత్తేశాయి. ఈ పథకం కింద రూ.42.56 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు నుంచి సరిగా బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కొత్త ప్రభుత్వం వస్తే మా బిల్లులు సంగతి ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించేందుకు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు, రోడ్డు ప్రమాద క్షతగాత్రులు, ఇతర శస్త్రచికిత్సలు అవరమయ్యే సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇకపై నగదు చెల్లించి వైద్యం పొందాల్సిన దుస్థితి ఏర్పడింది.
సేవలు నిలిచిపోకుండా చర్యలు
జిల్లాలోని 14 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు సేవలు నిలిచిపోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడుతున్నాం. అనకాపల్లిలోని ఒక ఉషాప్రైమ్ ఆసుపత్రిలోనే సేవలు నిలిపివేస్తున్నట్లు రెండు రోజుల ముందు నోటీసు ఇచ్చారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 42.56 కోట్లు ఉన్నాయి. బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం.
డా.ఐ.రంజిత్, జిల్లా కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్