బాలుడిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
బి.ఎన్.రోడ్డులో మత్స్యవానిపాలెం కూడలిలో బుధవారం సాయంత్రం గగన్ (9) అనే బాలుడిని నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
చక్రం కిందపడి విరిగిన చెయ్యి
బాలుడిని బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్తున్న బంధువులు
రావికమతం, న్యూస్టుడే: బి.ఎన్.రోడ్డులో మత్స్యవానిపాలెం కూడలిలో బుధవారం సాయంత్రం గగన్ (9) అనే బాలుడిని నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడి చెయ్యి బస్సు చక్రం కిందపడి విరిగింది. చింతపల్లి ప్రాంతానికి చెందిన ఈ బాలుడు తల్లిదండ్రులతో కలిసి మత్స్యవానిపాలెంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కూడలిలోని ఫ్యాన్సీ షాపులో చాక్లెట్లు కొనుక్కొడానికి వస్తూ రోడ్డు దాటుతుండగా చోడవరం వైపు నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ బాలుడిని ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును ఆపడంతో ఆ పిల్లాడికి ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన గగన్ను బంధువులు, ఆర్టీసీ డ్రైవర్ అదే బస్సులో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
కోటవురట్ల, న్యూస్టుడే: సైకిల్, బైకు ఢీ కొని రైతు మృతి చెందిన ఘటన కోటవురట్ల మండలం యండపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... యండపల్లి గ్రామానికి చెందిన రైతు గుడివాడ అప్పలనాయుడు(46) గ్రామ సమీపాన ఉన్న తన పొలం పనులు ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తున్నారు. ఇదే సమయంలో మండలంలోని సన్యాసిరాజుపాలెం గ్రామానికి చెందిన గంజి కన్నబాబు అన్నవరంలో ఉన్న తన బంధువుల ఇంటికి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ను వెనుక నుంచి బైక్తో ఢీ కొట్టడంతో అప్పలనాయుడు రోడ్డుపై కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై రమణయ్య తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఎలమంచిలి గ్రామీణం, న్యూస్టుడే: జాతీయ రహదారిపై లక్కవరం వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందినట్లు గ్రామీణ ఎస్సై సింహాచలం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన పల్లా లక్ష్మణరావు, ముకుందరాజుపేటకు చెందిన కె.రమణ, అదే మండలం డెంకాడ గ్రామానికి ఉద్దండం గిరీష్, కాసారపు నాగేంద్ర రెండు ద్విచక్ర వాహనాలపై గాజువాక తాపీ పనికి వెళ్తున్నారు. ఎలమంచిలి మండలం లక్కవరం వద్ద లక్ష్మణరావు, రమణ వెళ్తున్న బైక్ లారీని తప్పించబోయి ముందు వెళ్తున్న గిరీష్ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు, గిరీష్కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు (42) మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ఏలేరు కాలువలో మృతదేహం
కశింకోట, న్యూస్టుడే: తీడ సమీపంలోని ఏలేరు కాలువలో వ్యక్తి మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. ఏఎస్సై కె.రమణమ్మ కథనం ప్రకారం.. మాకవరపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన రాజాన మల్లేశ్వరరావు (44) మంగళవారం ఏలేరు కాలువ వద్దకు బహిర్భూమికి దిగి ప్రమాదవశాత్తు జారిపోయాడు. ఈత రాక మునిగిపోయాడు. మృతదేహం ఉదయం ఇక్కడికి కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల