ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ ఆగ్రహం
నత్తనడకన సాగుతున్న జీవీఎంసీ జోన్-2 కార్యాలయం ఆధునికీకరణ పనులను పరిశీలించిన కమిషనర్ సాయికాంత్వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవీఎంసీ జోన్-2 కార్యాలయం ఆధునికీకరణ పనుల పరిశీలన
అధికారులను ప్రశ్నిస్తున్న జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ
కొమ్మాది, న్యూస్టుడే: నత్తనడకన సాగుతున్న జీవీఎంసీ జోన్-2 కార్యాలయం ఆధునికీకరణ పనులను పరిశీలించిన కమిషనర్ సాయికాంత్వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంచాయతీ నాటి కాలంలో నిర్మించిన ఈ కార్యాలయాన్ని అన్ని హంగులతో ఆధునికీకరించేందుకు రూ.50 లక్షల జీవీఎంసీ నిధులు కేటాయించారు. ఇందుకు సంబంధించిన పనులు రెండు నెలలుగా సాగుతున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఆయా పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోందని అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతుండటం, కిటికీల గ్రిల్స్ తుప్పు పట్టడం, సన్సేడ్లు పెచ్చులూడటం, భవనాలపై మొక్కలు మొలిచి ఉండటంతో మరింత మండిపడ్డారు.
- రూ.లక్షల విలువైన సోలార్ వ్యవస్థను నిరుపయోగంగా వదిలేయటం, జోన్-2గా మార్చాల్సిన సౌకర్యం కేంద్రం బోర్డును జోన్-1గానే కొనసాగించడం తదితర వాటిని పరిశీలించి అధికారులు ఎవరూ బాధ్యతతో విధులు చేపట్టడం లేదన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఈ నెలాఖరులోపు కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పర్యవేక్షక ఇంజినీర్ శ్యామ్సన్రాజుకు ఆదేశాలు జారీ చేశారు.
- ఐటీ సెజ్ వద్ద ఆదిత్య బహుళ సముదాయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ సెజ్ పార్కును, టెన్నిస్ కోర్టు పనులను కమిషనర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఐటీ సెజ్ రహదారికి ఇరువైపులా ఉన్న అనధికార బడ్డీలను వెంటనే తొలగించాలని టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈఈ శాంతిరాజు, ఏఎంహెచ్వో డాక్టర్ కిశోర్, డీఈ వంశీ, ఏడీహెచ్ సురేష్, టీపీవో వరప్రసాద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే