ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు ఆర్ఓలదే బాధ్యత
ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఎ.మల్లికార్జున, చిత్రంలో ఏడీసీ కేఎస్ విశ్వనాథ్, కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మయూర్ అశోక్ తదితరులు
వన్టౌన్, న్యూస్టుడే: ఓట్ల లెక్కింపులో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 4న ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆర్ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పిదాలకు ఆర్ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశాలు నిర్వహించి వారిలో ఉండే అపోహలను తొలగించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్ల నిర్మాణం, రాజకీయ పార్టీల ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఈనెల 31వ తేదీ సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. పబ్లిక్ కమ్యూనికేషన్ గది, సెల్ఫోన్లు భద్రపరిచే కేంద్రం ఏర్పాటు, వాహనాల పార్కింగ్కు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ఈనెల 25న ఉంటుందని, రెండో విడత జూన్ 2న నిర్వహిస్తామని చెప్పారు. వారికి ఈనెల 27న శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్ సమయానికి ఒక్క నిమిషం ముందు వరకు వచ్చే పోస్టల్ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్వర్మ, అదనపు కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో మోహన్కుమార్, ఆర్డీఓలు హుస్సేన్ సాహెబ్, కె.భాస్కర్రెడ్డి, ఆర్ఓలు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్