జీవవైవిధ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరం
సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యం, ప్రజల సమష్టి కృషి వల్లే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. 2030 నాటికి అన్నిరంగాలకు సుస్థిరమైన పర్యావరణాభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు చిరంజీవి చౌదరి పేర్కొన్నారు.
విభిన్న సీతాకోక చిలుకలు
ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే : సమాజంలో అన్ని వర్గాల భాగస్వామ్యం, ప్రజల సమష్టి కృషి వల్లే జీవ వైవిధ్య పరిరక్షణ సాధ్యమవుతుందని.. 2030 నాటికి అన్నిరంగాలకు సుస్థిరమైన పర్యావరణాభివృద్ధి ఫలాలు అందుతాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో బుధవారం నిర్వహించిన జాతీయ స్థాయి జీవ వైవిధ్య దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సుస్థిర పద్ధతిలో ప్రయోజనాలు అందించేందుకు, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాయుత చర్యలతో ముందుకువెళుతోందని అన్నారు. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. రాబోవు 50 ఏళ్లలో సమాజంలోని అన్ని రంగాల, వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏయూ ప్రధాన కేంద్రంగా బయోడైవర్సిటీ పార్కును నెలకొల్పుతున్నా మన్నారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ బీవీఏ కృష్ణమూర్తి, విశాఖపట్నం జిల్లా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎస్.శ్రీకాంత్నాథ్ రెడ్డి, జాతీయ బయోడైవర్సిటీ అథారిటి ప్రతినిధి ఆచార్య హంచినల్ రాయప్ప రామప్ప, వై.ఎస్.ఆర్. హార్టీకల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.జానకీరామ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవవైవిధ్యంపై రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు.
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా వివిధ జీవుల ఆకృతుల ప్రదర్శన ఆకట్టుకుంది. జీవ వైవిధ్యాన్ని ఇవి కళ్లకు కట్టాయి. ప్రకృతి వనరులకు ముప్పు ఏర్పడితే జీవులకు కలిగే నష్టాన్ని ఈ ప్రదర్శనల ద్వారా వివరించారు.
ఈనాడు, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?