అనధికార విచారణ ఎందుకు?
విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో ‘బర్మా క్యాంపు’ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై ఇరువర్గాలతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించారు.
‘బర్మా క్యాంపు’ దాడి ఘటనపై అధికారుల దృష్టి
సందేహం వ్యక్తం చేస్తున్న బాధితులు
ఈనాడు, విశాఖపట్నం
విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో ‘బర్మా క్యాంపు’ ప్రాంతంలో జరిగిన దాడి ఘటనపై ఇరువర్గాలతో అధికారులు మాట్లాడే ప్రయత్నం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారించారు. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు మళ్లీ చేస్తున్న ప్రయత్నాల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న సందేహాలను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనపై ఇప్పటికే పోలీసు కమిషనర్ ఇచ్చిన నివేదికను జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టరు మల్లికార్జున... కొద్ది రోజుల కిందటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. ఇప్పుడు మళ్లీ అనధికార విచారణకు రావాలని అధికారుల నుంచి బాధితులకు ఫోన్లు రావడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
- వైకాపాకు ఓటు వేయలేదని ఆ పార్టీకి చెందిన కొందరు దాడి చేశారని నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు చెబుతుండగా... పోలీసులు మాత్రం వ్యక్తిగత కుటుంబ తగాదాగా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో జేసీకి వినతి ఇచ్చారు. తమకు న్యాయం జరగలేదని, రాజకీయ కారణాలతో దాడి జరిగితే వ్యక్తిగత కారణాలంటూ కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఈ తరుణంలో బుధవారం గోపాలపట్నం తహసీల్దార్ కార్యాలయానికి ఆర్డీవో ఇరువర్గాలను పిలిపించగా.. బాధితులు హాజరవ్వలేదు. వచ్చిన ఒక వర్గంలోని కొందరితో మాట్లాడి పంపించేశారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకే పిలిపించారా? ఇంకేదైనా ఉందా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 15వ తేదీ రాత్రి ఘటన చోటుచేసుకోగా... 16న వెలుగులోకి వచ్చింది. 17న బాధితులు మీడియా ముందుకురావడంతో రాజకీయ కోణం బయటపడింది. అయినప్పటికీ అధికారులు వాస్తవాలు పట్టించుకోవడం లేదన్నది బాధితుల ఆరోపణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల