ఏదీ... మత్స్యకార భరోసా?
మత్స్యకార భరోసా నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏటా మే రెండో వారంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసేది. ఈసారి అలా జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉంది.
లబ్ధిదారుల గుర్తింపు పూర్తయినా అందని నిధులు
చేపలరేవులో నిలిపి ఉన్న బోట్లు
వన్టౌన్, న్యూస్టుడే: మత్స్యకార భరోసా నిధులు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఏటా మే రెండో వారంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేల చొప్పున బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసేది. ఈసారి అలా జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే నెల 10వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు సాగే అవకాశం కనిపిస్తోంది.
- విశాఖ జిల్లాలో మరపడవలు, ఇంజిను పడవలు, తెప్పలు కలిపి 2,264 వరకు ఉన్నాయి. వీటిలో 695 వరకు మరపడవలున్నాయి. మిగిలినవన్నీ ఇంజిను పడవలు, తెప్పలు. చేపలరేవుతో సహా 15 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లున్నాయి. ఆయా కేంద్రాల్లోని మత్స్యకారులు, బోట్లకు సంబంధించిన సర్వే ప్రక్రియను మత్స్యశాఖ ఇన్ఛార్జి జేడీ విజయకృష్ణ ఆధ్వర్యంలో 15 బృందాలు నిర్వహించాయి. చేపలవేటపై 13,517 మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. ఆ వివరాలను మత్స్యశాఖ కమిషనర్కు నివేదించారు. ఇది కేవలం ప్రాథమిక నివేదిక మాత్రమే. అన్ని జిల్లాల నుంచి వచ్చే నివేదికలను పరిశీలించి ఆరంచెల గుర్తింపు ప్రక్రియను మత్స్యశాఖ సంచాలకుల కార్యాలయం చేపట్టనుంది. తుది వడబోతలో ఎంతమంది మత్స్యకారులున్నది తేలనుంది. లబ్ధిదారులల్లో ఐటీ చెల్లింపుదారులు, 300 యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగించేవారు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిపొందేవారు ఉంటే భరోసా అందబోదు. అటువంటి వారి పేర్లు తొలగించి తుది జాబితాను మత్స్యశాఖ డైరెక్టర్ కార్యాలయం విడుదల చేయనుంది. ఆ జాబితా ప్రకారమే మత్స్యకార భరోసా కింద రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. వచ్చే నెల 15 నుంచి సముద్రంలో ఉత్పత్తుల వేట ఆరంభం కానుంది. ఎన్నికల ఫలితాల తరువాత ఏర్పడబోయే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం భరోసా నిధులు అందేసరికి మరికొంత సమయం పట్టనుంది.
- ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ఇటీవల కొన్ని పథకాలకు నిధులను ఈసీ అనుమతితో అధికారులు విడుదల చేశారు. ఇదే విధానాన్ని తమకూ వర్తింపజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఏప్రిల్15 నుంచి జూన్ 15 వరకు సముద్ర ఉత్పత్తుల వేటపై నిషేధం ఉన్నందున నిషేధ సమయంలో భరోసా నిధులు ఇస్తే తమ అవసరాలు తీరుతాయని, వేట మొదలయ్యాక ఇస్తే ఏం లాభమని వీరు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం