అవకాశం ఉన్నా.. వినియోగం సున్నా
ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు మధురఫలం మామిడిని విషతుల్యంగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సహజంగా మగ్గించిన మామిడిపండ్లను గతంలో మార్కెట్కు తీసుకువచ్చేవారు.
నిరుపయోగంగా మామిడి రైఫనింగ్ ఛాంబర్లు
నర్సీపట్నం గ్రామీణం, న్యూస్టుడే
సహజంగా మగ్గించిన మామిడి పండ్లు
ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు మధురఫలం మామిడిని విషతుల్యంగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సహజంగా మగ్గించిన మామిడిపండ్లను గతంలో మార్కెట్కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెట్టి ప్రజారోగ్యానికి ముప్పు తెస్తున్నారు. ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్లో ఈ పండ్లకు గిరాకీ పెరిగింది. రకాన్ని బట్టి డజను పండ్లు రూ. 300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. త్వరగా రంగు రప్పించి మార్కెట్లో అమ్ముకోవాలన్న ఆరాటంతో రసాయనాలు వినియోగించి పక్వానికి తెస్తున్నారు. ఇవి చూడటానికి రంగుగా కనిపించినా తినేసరికి పుల్లగా ఉంటున్నాయి.
పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిరుపయోగంగా రైఫనింగ్ కేంద్రం
- జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కె.కోటపాడు, సబ్బవరం, నక్కపల్లి, ఎస్.రాయవరం తదితర మండలాల్లో దాదాపు పాతికవేల ఎకరాల వరకు మామిడితోటలు ఉన్నాయి. బంగినపల్లి, సువర్ణరేఖ, చెరకురసం తదితర రకాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న పండ్లు చూడటానికి బాగానే ఉన్నా రుచి అంతగా ఉండటం లేదని వినియోగదారులు చెబుతున్నారు. చాలామంది రసాయనాలు వినియోగించి మగ్గించడమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. కార్బైడ్తో మగ్గించడాన్ని 2012లోనే ప్రభుత్వం నిషేధించినా ఇప్పటికీ చాలామంది వినియోగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో అధికారులు మార్కెట్ల్లో తనిఖీలు నిర్వహించి వ్యాపారులను హెచ్చరించేవారు. ఈ ఏడాది ఎక్కడా తనిఖీలు లేవు.
- ఆరోగ్యదాయకంగా ఉండేలా పండ్లను మగ్గించేందుకు నర్సీపట్నం, పాయకరావుపేట మార్కెట్ యార్డుల్లో దశాబ్దం కిత్రమే దాదాపు రూ. 50 లక్షలతో రైఫనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇవి పూర్తిస్థాయిలో వినియోగమయ్యేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. రైతులు, వ్యాపారులు పక్వానికి వచ్చిన కాయలను వీటిలో సహజంగా మగ్గించుకోవచ్చు. మూడు రోజుల్లో సహజంగా పక్వానికి వస్తాయి. వీటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే ప్రజలకు సహజ రుచితో కూడిన పండ్లను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
రసాయనాలతో మగ్గించిన మామిడి పండ్లు
మామిడి తోటలను రైతులు వ్యాపారులకు లీజుకు ఇస్తుంటారు. హానికర రసాయనాలతో పండ్లను మగ్గించడం నేరమని యంత్రాగం విస్తృతంగా ప్రచారం చేయాలి. కోత నుంచి మార్కెట్కు చేర్చేవరకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ