బడి బస్సుల అనుమతులకు బ్రేకులు!
వేసవి సెలవులు ముగిసి, జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నారు. పిల్లలను బడులకు తీసుకెళ్లే ప్రతి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నది రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని సామర్థ్య ధ్రువీకరణ పత్రం (ఫిట్నెస్ సర్టిఫికెట్) పొందాలి.
నిలిచిన ఈ-ప్రగతి సాఫ్ట్వేర్
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే
రవాణా కార్యాలయం వద్ద పాఠశాలల బస్సులు
వేసవి సెలవులు ముగిసి, జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరవనున్నారు. పిల్లలను బడులకు తీసుకెళ్లే ప్రతి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదా అన్నది రవాణా శాఖ అధికారులతో తనిఖీ చేయించుకుని సామర్థ్య ధ్రువీకరణ పత్రం (ఫిట్నెస్ సర్టిఫికెట్) పొందాలి. అప్పుడే బడి బస్సులు రోడ్డెక్కాలి. కానీ ఈ ప్రక్రియకు తాత్కాలికంగా అవరోధం ఏర్పడింది. ధ్రువీకరణ ప్రతాల జారీకి అవసరమైన ఈ-ప్రగతి సాఫ్ట్వేర్ సేవలు నిలిచిపోయాయి.
అనకాపల్లి జిల్లాలో 419 పాఠశాల, కళాశాలల వాహనాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 160 వాహనాలకు మాత్రమే తనిఖీలు పూర్తయ్యాయి. వాస్తవానికి మే 16తోనే సామర్థ్య ధ్రువీకరణ పొందడానికి గడువు పూర్తయింది. కానీ చాలా వాహనాలు ఇంకా తనిఖీ చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించారు బడులు తెరిచేలోగా ప్రతి ఒక్క బడి బస్సు ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంది. లేకుంటే వాహనాలు తిప్పడానికి వీలులేదని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో నిర్దేశిత ఫీజు చెల్లించిన పలు బడి బస్సులు అనకాపల్లి కార్యాలయానికి వచ్చాయి. తీరా గురువారం నుంచి వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీచేసే ఈ-ప్రగతి సాఫ్ట్వేర్ పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
బస్సులను పరిశీలిస్తున్న సిబ్బంది
పేరుకుపోయిన బకాయిలు
ఈ ప్రగతి సాఫ్ట్వేర్ను 2015లో ప్రవేశపెట్టారు. రవాణా శాఖలో చాలా సేవలను దీనిద్వారా అందిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ సాప్ట్వేర్ నిర్వాహకులకు బకాయిలు చెల్లించకపోవడంతో పేరుకుపోయాయి. రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుండటంతో బకాయిలు వస్తాయో, రావో అన్న సందిగ్థంతో ఈ-ప్రగతి సాఫ్ట్వేర్ను గురువారం నుంచి నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన్ సాఫ్ట్వేర్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి. అయితే వాహన్ సాఫ్ట్వేర్ వినియోగం, ధ్రువీకరణ పత్రాల జారీపై ఇక్కడి సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దీనికితోడు ఇప్పటివరకు ఈ-ప్రగతి సాఫ్ట్వేర్లో వాహనాల ధ్రువీకరణకు ఫీజులు చెల్లించిన డబ్బులు తిరిగి వస్తాయా, లేక వాహన్ సాఫ్ట్వేర్లోకి మార్చవచ్చా అన్నదానిపై స్పష్టత లేదు. ఉన్నట్టుండి ఎలాంటి సమాచారం లేకుండా సాఫ్ట్వేర్ను ఆపేసి వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడం తగదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లాలోని పాఠశాల, కళాశాల వాహనాలతో పాటుగా ఇతర వాహనాల సామర్థ్య ధ్రువీకరణ ముందుకు సాగలేదు.
ఇబ్బందులు లేకుండా చూస్తాం..
- ప్రకాశరావు, ఇన్ఛార్జ్ ఆర్టీఓ, అనకాపల్లి
ఈ-ప్రగతి సాఫ్ట్వేర్ గురువారం నుంచి నిలిచిపోయింది. సామర్థ్య ధ్రువీకరణ పత్రాలను వాహన్ సాఫ్ట్వేర్లో నమోదు చేయించి అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని సక్రమంగా ఉన్న వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్రాలు అందిస్తాం. పాఠశాల, కళాశాలల వాహనాలకు సకాలంలో ధ్రువీకరణ చేయించుకోవాలి. ఇది లేకుండా తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ