అందరి ‘నోటా’ అదే మాట..!
ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా.. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ‘నోటా’కు పడిన ఓట్ల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే మాట అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది.
గత ఎన్నికల్లో భారీగా పోలైన ఓట్లు
రాష్ట్రంలో అత్యధికంగా అరకు పార్లమెంట్ పరిధిలోనే నమోదు
ఈనాడు, పాడేరు
ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ మెజారిటీతో అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా.. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో గట్టెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ‘నోటా’కు పడిన ఓట్ల సంఖ్య ఎక్కువే ఉండొచ్చనే మాట అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఓట్ల పండగ ముగిసిన రోజు నుంచే అభ్యర్థుల గెలుపోటములపై ప్రధాన పార్టీలు అంచనాలు వేస్తూ వస్తున్నాయి. బూత్ల వారీగా పోలింగ్ సరళిని పరిశీలించి విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈసారి విజయావకాశాలపై నోటా ప్రభావం అనేదానిపైనా చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో నోటాకు పెద్దగా ఓట్లు పడలేదు. కానీ గత ఎన్నికల్లో అన్నిచోట్లా గణనీయంగానే పోలయ్యాయి. తాజా ఎన్నికల్లో కూడా అదే తీరున నోటాకు ఎక్కువ ఓట్లు పడితే అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడే ఆస్కారం లేకపోలేదని రాజకీయ వర్గాలు కంగారు పడుతున్నాయి.
తెలిసి కొందరు.. తెలియక ఇంకొందరు..
‘ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. పోటీలో నిలిచే అభ్యర్థుల్లో సమర్థులైన నాయకుడిని ఎంచుకుని ఓటేయండి. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ మీకు నచ్చలేదు అనుకుంటే పైవారెవరూ కాదు అనే నోటా గుర్తుకైనా ఓటు వేయండి. అంతేకాని ఓటు వేయకుండా ఉండొద్దు’ అని ఎన్నికల సంఘం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది. 2014లో ప్రవేశపెట్టిన ఈ నోటా పట్ల తొలి ఎన్నికల్లో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం నోటా మీట నొక్కినవారి సంఖ్య భారీగా పెరిగింది. 2014లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లో 14,457 ఓట్లు నోటాకు పడితే... 2019లో ఈ సంఖ్య 48,621కి పెరిగింది.
అభ్యర్థులు నచ్చక కొందరు నోటాకు ఓటేస్తే.. ఆ గుర్తు ఏంటో అవగాహన లేకుండానే ఓటేసేవారు చాలామంది ఉన్నారు. నిరక్షరాస్యుల్లో చాలామందికి నోటా అంటే ఏంటో ఇప్పటికీ తెలీదు. మన్యలోని గిరిజనుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులుఉంటారు. వారిలో అధికమంది పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో గుర్తులు సరిగా పోల్చుకోలేక ఏదైతే ఏంటని ఆఖరిగా ఉండే బటన్ నొక్కేసి వచ్చేస్తున్నారు. మైదాన ప్రాంతం కంటే మన్యంలో నోటాకు రెండింతల ఓట్లు పోలవ్వడమే ఇందుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
ఓటేసేందుకు బారులుదీరిన మహిళలు (పాతచిత్రం)
అరకులోనే అత్యధికం
గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్థానాల్లో నోటాకు పడిన ఓట్ల పరంగా చూస్తే అరకు పార్లమెంటు రెండో స్థానంలో నిలిచినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2019లో అరకు ఎంపీ స్థానంలో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో 3.5 శాతం పడటం విశేషం. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నోటాకు భారీగానే ఓట్లు పడ్డాయి. 2014లో 4,933 ఓట్లు పోలైతే.. 2019లో 10,177 ఓట్లు పడ్డాయి. వీటిలో చాలావరకు గిరిజనులకు అవగాహన లేక వేసిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మద్యం తాగి వచ్చి ఏదో ఒకటి నొక్కేసి వెళ్లిపోతున్నారు. మరికొందరు మాత్రం
ఏ పాలకులు వచ్చినా మన్యానికి ఏం చేయడం లేదనే నిరాశతో నోటా మీట నొక్కి కనిపించని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గెలుపోటములపైనా ప్రభావం..
ఈసారి ఓటింగ్ భారీగా జరిగినా మెజారిటీ మాత్రం 2 వేల నుంచి 5 వేల ఓట్లతో గెలిచేవారే ఎక్కువ ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆయా చోట్ల నోటాకు పడిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయి. 2014లో చోడవరం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 909 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్కడ నోటాకు 931 ఓట్లుపడ్డాయి. అభ్యర్థి మెజారిటీ కంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎలమంచిలి, అనకాపల్లిలో తక్కువ మెజారిటీతోనే వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా నియోజకవర్గాల్లో 2,500 నుంచి మూడు వేల ఓట్లు నోటాకు పడ్డాయి. ఆ ఓట్లు తారుమారైతే ఫలితాలు మారే అవకాశం ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే ఎవరి విజయవకాశాలను దెబ్బతీస్తాయోనని అందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు