మత్తు.. జీవితాలు చిత్తు!!
విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మద్యం తాగే అలవాటుంది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్దిరోజులుగా కేజీహెచ్లోని వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో రెండు సార్లు మద్యం తాగితే ఫిట్స్ వచ్చింది. దీంతో భయపడి పూర్తిగా మానేయడానికి సిద్ధపడ్డారు.
డ్రగ్స్ బారిన యువత
విముక్తి కేంద్రాలకు వస్తున్నది కొందరే
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
1. విశాఖకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి మద్యం తాగే అలవాటుంది. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు. కొద్దిరోజులుగా కేజీహెచ్లోని వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. మధ్యలో రెండు సార్లు మద్యం తాగితే ఫిట్స్ వచ్చింది. దీంతో భయపడి పూర్తిగా మానేయడానికి సిద్ధపడ్డారు.
2. నగరానికి చెందిన బాలుడు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కొవిడ్ సమయంలో ఇంట్లోనే ఉండటంతో.. గంజాయి ఎలా తీసుకోవాలని యూట్యూబ్లో వెతికాడు. సమీప పాన్షాప్లో దొరుకుతుందని తెలిసి..కొనుగోలు చేసి అలవాటు చేసుకున్నాడు. అబ్బాయి ప్రవర్తనలో మార్పులు గమనించిన తల్లిదండ్రులు కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆ బాలుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఆసుపత్రిలో చేర్చారు.
3. విశాఖ నగరానికి చెందిన 30 ఏళ్ల యువకుడు సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. కొన్నేళ్లుగా గంజాయి, మత్తు పదార్థాలు తీసుకునేవాడు. మానసిక ఆసుపత్రిలోని ఒపీయోడ్ సబ్స్టిట్యూషన్ సెంటర్ (ఓఎస్టీ)లో నాలుగేళ్లుగా చికిత్స పొందుతున్నాడు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది.
....పైన పేర్కొన్నవారే కాదు.. ఇలా ఎంతో మంది మత్తు పదార్థాల బారిన పడి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలతలు వస్తున్నాయి. మత్తు పదార్థాలకు బానిసైన వారికి కేజీహెచ్, ప్రభుత్వ మానసిక ఆసుపత్రుల పరిధిలోని వ్యసన విముక్తి కేంద్రాల్లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. బాధితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
ఔషధాలనూ వాడేస్తున్నారు: నగరంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 35-45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మద్యం బారిన పడుతున్నారు. మద్యం తాగితే వాసన వల్ల ఇంట్లో తెలిసిపోతుందనే భయంతో యువత గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా గంజాయి తీసుకుంటున్నారు. శస్త్రచికిత్సల సమయంలో రోగులకు మత్తు కోసం వినియోగించే కొన్ని రకాల ఔషధాలను మత్తు కోసం కొందరు వాడుతున్నారు. ఉల్లాసానికి, నిద్రకు కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు. వివిధ రకాల ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
నడవలేని స్థితిలో చికిత్సకు..
కేజీహెచ్లోని వ్యసన విముక్తి కేంద్రాన్ని 2020లో ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, పాడేరు తదితర ప్రాంతాల నుంచి రోజుకు కనీసం 10 మంది ఇక్కడికి వస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ అవసరమైన బాధితులను ప్రభుత్వ మానసిక ఆసుపత్రికి పంపిస్తున్నారు. మానసిక ఆసుపత్రిలో 2020 జనవరిలో ఒపీయోడ్ సబ్స్టిట్యూషన్ సెంటర్ (ఓఎస్టీ) ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన పలువురు ... కళ్లు, ముక్కు నుంచి నీరు కారుతూ...కడుపు నొప్పి, వివిధ అనారోగ్య సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు. కొందరు వణికిపోతూ, కనీసం స్వయంగా నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ప్రస్తుతం 100 మంది వరకు ఎప్పటికప్పుడు వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న కొందరు యువత ఇప్పటికీ ఆ అలవాటు నుంచి బయటకు రాలేకపోతున్నారు.
మద్యం బారిన పడిన వ్యక్తులు ఫాటీ లివర్, జాండిస్, హెపటైటిస్, గ్యాస్ట్రిక్, కిడ్నీ, కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థో, న్యూరో, గ్యాస్ట్రో, నెఫ్రో తదితర విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. ఫిట్స్తో బాధపడుతున్న వ్యక్తులు మెదడుకు సంబంధించిన సమస్య అనుకుని న్యూరాలజీ విభాగానికి వెళ్తున్నారు. మద్యం వల్ల ఆ సమస్య వస్తుందని చాలా మందికి తెలియడం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఉచిత చికిత్స, మందులు..
తమతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఎన్నో బాధలు పడుతున్నారని గ్రహించిన కొందరు మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ సమయంలో వణుకు, నిద్రలేమి తదితర సమస్యలు వస్తున్నాయి. డ్రగ్స్ వినియోగిస్తే ఏ సమస్యలు రావనే ఉద్దేశంతో మళ్లీ మొదలుపెడుతున్నారు. పూర్తిగా విసిగిపోయిన కుటుంబ సభ్యులు వ్యసనపరులను ఆయా కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అక్కడి వైద్యులు, సిబ్బంది బాధితులకు వ్యక్తిగత, ఫ్యామిలీ, బృంద కౌన్సెలింగ్ చేపడతారు. ఉచితంగా చికిత్స చేయడంతోపాటు మందులు అందజేస్తున్నారు. చికిత్సకు వెళ్తే పోలీసులు డ్రగ్స్ సంబంధిత కేసు పెడతారేమోనని, పరువు పోతుందనే భయంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే..చికిత్స పొందే రోగుల వివరాలు గోప్యంగా ఉంటాయని సిబ్బంది భరోసా కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు