కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు.
సీఈవోతో కలెక్టర్ ఎ.మల్లికార్జున
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్ ఎ.మల్లికార్జున, చిత్రంలో జేసీ మయూర్ అశోక్, ఏడీసీ కేఎస్ విశ్వనాథన్, కమిషనర్ సాయికాంత్వర్మ, డీఆర్వో మోహన్కుమార్
వన్టౌన్, న్యూస్టుడే: ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో ఫలితాలను వెల్లడించేందుకు ఈసీ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గురువారం ఉదయం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్మీనా రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ మల్లికార్జున కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. కేంద్ర బలగాలతో పాటు సుమారు 500 మంది సివిల్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 176 సీసీ కెమెరాలను అమర్చి మానటరింగ్ రూమ్కు అనుసంధానం చేసినట్లు వివరించారు.
- పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో లెక్కింపునకు ఏడు హాళ్లు గుర్తించి 98 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని, 140 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఒక టేబుల్కు సూపర్వైజర్, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులను నియమిస్తున్నట్లు చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు రౌండ్లలో పూర్తి చేస్తామన్నారు.
- అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలట్ల లెక్కింపునకు అయిదు హాళ్లలో 33 టేబుళ్లు ఉంటాయన్నారు. ఈనెల 25న తొలి విడత, జూన్ 2న రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. వీసీలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్అశోక్, డీఆర్వో మోహన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ