పాదచారుల వంతెనలపై ప్రమాద ఘంటికలు
తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రైల్వేస్టేషన్లో పలు చోట్ల శిథిలం
ఆందోళనలో ప్రయాణికులు
విశాఖపట్నం, న్యూస్టుడే: తూర్పు కోస్తా రైల్వే విశాఖ రైలు నిలయంలో నిత్యం ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాల్సిన వాల్తేరు అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లో మూడు పాదచారుల వంతెనలు ఉన్నాయి. వాటిలో గేట్-1 ప్రధాన వంతెన 3, 4 ప్లాట్ఫామ్ల మధ్య ఏప్రిల్ 8న కుంగిపోయింది. వాల్తేరు రైల్వే అధికారులు దాన్ని హుటాహుటిన తొలగించారు. వాడుకలో ఉన్న వంతెన ఒక్కసారి కుంగిపోవడానికి కారణాలపై విచారణ చేపట్టారు. అంతే కాకుండా స్టేషన్లో మిగిలిన వంతెనల పరిస్థితిపై తనిఖీలు నిర్వహించారు. అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల స్తంభాలు తుప్పుపట్టి శిథిలమైనట్లు గుర్తించారు. త్వరలో స్టేషన్ ఆధునికీకరణ చేపట్టనుండడంతో ఆ వంతెనలకు ప్రత్యేకంగా చేసేదేమి లేక పక్కన పెట్టినట్లు సమాచారం. కుంగిపోయిన వంతెన భాగాన్ని తొలగించడంతో పాటు పూర్తిగా మూసేశారు. దీంతో స్టేషన్లో మిగిలిన రెండు వంతెనలపై భారం పడి నిత్యం తీవ్ర రద్దీ నెలకొంటోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. స్టేషన్లో అత్యధిక రైళ్లు 3, 4 ప్లాట్ఫామ్ల నుంచి రాకపోకలు సాగిస్తుండటం.. ఆయా వంతెనలు కిక్కిరిసిపోతుండడంతో రాకపోకలు సాగించే వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కోసారి తోపులాట జరుగుతుండడంతో భయాందోళన చెందుతున్నారు.
ఆ వంతెన అందుబాటులోకి వచ్చేదెప్పుడో..!
కుంగిపోయి మూతపడిన వంతెనను వాల్తేరు అధికారులు ఇప్పట్లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వంతెన మూతపడి 40 రోజులు గడిచిపోయాయి. ఇంత వరకు ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఈ వంతెనలో 1వ నంబరు ప్లాట్ఫామ్ నుంచి 3వ నంబరు ప్లాట్ఫామ్ వరకు పాడైనట్లు గుర్తించిన అధికారులు ఆ భాగాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పనులు ఎప్పడు ప్రారంభిస్తారు.. ఎప్పటికి వంతెన అందుబాటులోకి వస్తుందనే అంశంపై వాల్తేరు అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికైనా వంతెన పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్