అతివేగం.. తీసింది నిండుప్రాణం
సరదా ప్రయాణం విషాదాన్ని నింపింది. అచ్యుతాపురం సెజ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది.
యువతి మృతితో విషాదం
అచ్యుతాపురం, న్యూస్టుడే
సరదా ప్రయాణం విషాదాన్ని నింపింది. అచ్యుతాపురం సెజ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, ఎస్సై నారాయణ కథనం ప్రకారం.. సబ్బవరం మండలం పైడివాడకు చెందిన బొబ్బరి లావణ్య (20) రాంబిల్లి మండలం హరిపాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో హోమ్సైన్స్కు సంబంధించి ఇంటర్న్షిప్ చేసేందుకు నెలరోజుల క్రితం చేరింది. అచ్యుతాపురంలోని ప్రైవేటు వసతిగృహంలో ఉంటోంది. గురువారం రోజూ మాదిరిగా విధులకు వెళ్లి తిరిగి అచ్యుతాపురం వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో సబ్బవరానికి చెందిన గండి మురళీకృష్ణ అక్కడకు వచ్చాడు. నానమ్మకు బాగాలేదని వసతిగృహంలో చెప్పి లావణ్యను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం ఇద్దరూ ద్విచక్రవాహనంపై అచ్యుతాపురం నుంచి పూడిమడక తీరంవైపు వెళ్లారు. అతివేగంగా ప్రయాణిస్తుండటంతో దుస్తుల పరిశ్రమ ఎదురుగా ఉన్న వేగనిరోధకాల వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లావణ్య తల రోడ్డును బలంగా ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావమైంది. సెజ్ ఉద్యోగి సతీష్ అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడకు వచ్చి లావణ్యను బతికించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. అంతవరకు తనతో కలిసి ప్రయాణించి యువతి కళ్లముందే మృతి చెందడంతో మురళీకృష్ణ రోదించాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఏకైక ఆడపిల్ల అన్యాయంగా మృతి చెందిందని బాధిత కుటుంబసభ్యులు బోరుమన్నారు. లావణ్య తండ్రి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ