కబళించిన మృత్యువు
బోయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడిన ఘటన చూపరులను కన్నీరు పెట్టించింది.
రోడ్డు ప్రమాదంలో తల్లి దుర్మరణం, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు
ఆనందపురం, న్యూస్టుడే: బోయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడిన ఘటన చూపరులను కన్నీరు పెట్టించింది. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం గనివాడ గ్రామానికి చెందిన సావాళ్ల చిన్నకు భార్య నవ్య(40), ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానికంగా చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కుమార్తె ఝాన్సీని ఆనందపురం మండలం బోయపాలెంలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో చేర్పించడానికి కుమారుడు రాజు ద్విచక్రవాహనంపై శుక్రవారం ఉదయం తల్లి, కుమార్తెలు బయలుదేరారు. పెందుర్తి వైపు నుంచి జాతీయ రహదారిపై రావడంతో ఆనందపురం కూడలి వద్ద సర్వీస్ రోడ్డు సదుపాయం లేక కూడలి దాటిన తర్వాత బోయపాలెం వెళ్లడానికి వేరొక రోడ్డువైపు తిరిగారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైకును ఢీకొనడంతో తల్లి నవ్య లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందగా రాజు, ఝాన్సీ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తగరపువలస సమీప ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం భీమిలి ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరావు వెల్లడించారు.
తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య
డాబాగార్డెన్స్, న్యూస్టుడే: తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకొంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం మండలం, సింగిరెడ్డివలస గ్రామానికి చెందిన బాలిక (17) మహారాణిపేట పరిధిలోని బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెకు ఫోన్ చేసి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన బాలిక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాను హుక్కుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై లారీ బోల్తా..
ఆనందపురం, న్యూస్టుడే: ఆనందపురం-అనకాపల్లి 16వ జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. ఆనందపురం మండలం శొంఠ్యాం వద్ద తూర్పు గోదావరి జిల్లా నారాయణపురం నుంచి బిహార్కు చేపల లోడుతో వెళ్తున్న లారీ శుక్రవారం తెల్లవారుజామున డివైడర్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో లారీ క్యాబిన్, చక్రాలు విడిపోయాయి. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు వెంటనే చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కేసు నమోదు చేశామని సీఐ తిరుపతిరావు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
[ 27-07-2024]
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్