డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీ తులసి సరెండర్
కేజీహెచ్ పరిపాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, ఇన్ఛార్జి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీ తులసిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నర్సింహం ఉత్తర్వులు జారీ చేశారు.
వన్టౌన్, న్యూస్టుడే: కేజీహెచ్ పరిపాలన వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, ఇన్ఛార్జి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీ తులసిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ వైద్య విద్యాసంచాలకులు (డీఎంఈ) డాక్టర్ నర్సింహం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆమెను తప్పిస్తూ ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ పి.అశోక్కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఆర్ఎంఓగా పనిచేస్తున్న డాక్టర్ దవళ భాస్కర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. శుక్రవారం ఉదయమే ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- డాక్టర్ లక్ష్మీ తులసి 8నెలల క్రితమే ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా వచ్చారు. ఆరోగ్యశాఖ సంచాలకులు (డిహెచ్) పరిధిలో విధులు నిర్వహించే ఆమెను కేజీహెచ్కు కేటాయించారు. ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీ తులసిపై నేరుగా సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా డీఎంఓ డాక్టర్ నర్సింహం గతంలో కేజీహెచ్కు వచ్చి విచారణ జరిపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు పిలిపించి విచారించారు. అనంతరం ఆమెను సరెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మాతృశాఖ ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయం కేజీహెచ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలపై కీలక వైద్యాధికారిని సరెండర్ చేయడం ఇటీవల కేజీహెచ్లో చోటు చేసుకోలేదు. గత నెలలో నర్సింగ్ విభాగ గ్రేడ్-1 పర్యవేక్షకులు విజయలక్ష్మిని అవినీతి ఆరోపణలపై సరెండర్ చేశారు. ఇటీవల కాలంలో అధికారుల స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువలా వస్తున్నాయి. దిగువస్థాయి ఉద్యోగులను దూషించడం, నచ్చనివారి పట్ల కఠినంగా వ్యవహరించడం, తదితర ఆరోపణలు ఉన్నాయి.
- ఇక్కడ అధికారుల తీరుతెన్నులపై నేరుగా సీఎంఓ, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలకు ఫిర్యాదులు వెళుతున్నాయి. స్థానికంగా ఉన్నతాధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ వారి దృష్టికి ఇక్కడి వ్యవహరాలను తీసుకెళ్లడం లేదు. అంతా ఏకమవుతుండడంతో న్యాయం జరగదనే ఉద్దేశంతో నేరుగా ఫిర్యాదులు వెళుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా కేజీహెచ్లో పనిచేసే అధికారుల తీరుపై కలెక్టర్ దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత