‘బ్యాలట్’తో కలిపి పోలింగ్ శాతం 71.2
జిల్లాలో పోస్టల్ బ్యాలట్ కలిపితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు.
లోక్సభలో 72.3 శాతం
కలెక్టర్ మల్లికార్జున వెల్లడి
వన్టౌన్, న్యూస్టుడే: జిల్లాలో పోస్టల్ బ్యాలట్ కలిపితే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 4న ఓట్ల లెక్కింపును ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, దీనికి అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
జిల్లాలో 20,12,373 మంది ఓటర్లు ఉంటే 70.03 శాతం అంటే 14,09,316 మంది ఈవీఎంల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 23,981 మంది పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓట్లు వేశారని, దీంతో జిల్లా పోలింగ్ శాతం 71.2 శాతానికి చేరుకుందన్నారు. లోక్సభ పరిధిలో 13,70,484 మంది ఓటర్లు ఉంటే ఈవీఎంల్లో 71.11 శాతం మంది ఓట్లు వేశారని, పోస్టల్ బ్యాలట్ ద్వారా 22,454 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఓటింగ్ శాతం 72.3 శాతానికి చేరుకుందని వివరించారు.
ఏజెంట్లకు 18ఏళ్లు దాటి ఉండాలి..: ఈనెల 31వ తేదీలోపు కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను నిర్ణీత నమూనాలో అందజేయాలని కలెక్టర్ కోరారు. 18ఏళ్లు దాటిన వారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నవారు అనర్హులన్నారు. ఈసీ నిబంధనలు
కచ్చితంగా పాటించాలని, అధికారికంగా గుర్తింపు పొంది, ఐడీ కార్డులు పొందిన ఏజెంట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కావడానికి గంటన్నర ముందే చేరుకోవాలన్నారు.
ఓట్లను లెక్కించే కేంద్రాలు ఇలా..: ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని ఈఈఈ బ్లాక్ సెమినార్ హాలు తొలి అంతస్తు రూమ్ నెంబరు 4లో పోస్టల్ బ్యాలట్ ఓట్లను లెక్కిస్తామని కలెక్టర్ వెల్లడించారు. భీమిలి ఓట్లను న్యూ క్లాస్రూమ్ కాంప్లెక్సులోని 5,7 గదుల్లో, తూర్పు నియోజకవర్గ ఓట్లను న్యూక్లాస్రూమ్ కాంప్లెక్సులోని 9,10 గదుల్లో, దక్షిణం ఓట్లను కంప్యూటర్ సైన్స్ బ్లాక్లో, ఉత్తరం ఓట్లను న్యూక్లాస్ రూమ్ కాంప్లెక్సు 1,5 గదుల్లో, పశ్చిమం ఓట్లను ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ బ్లాక్ సెమినార్ హాలు రూమ్ నెంబరు 3లో, గాజువాక ఓట్లను కెమికల్ ఇంజినీరింగ్ బ్లాక్లోని గ్రౌండ్ఫ్లోరు మొదటి అంతస్తులో లెక్కిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు పోలైన ఓట్లను వేర్వేరుగా లెక్కిస్తామని చెప్పారు. సమావేశంలో డీఆర్వో కె.మోహన్కుమార్, ఆర్ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం