ఓట్ల లెక్కింపునకు 14 గంటలు..!
విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 12 గంటల నుంచి 14గంటల సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నానికి విశాఖ పశ్చిమం, దక్షిణం పూర్తి
ఆధిక్యాలు ఉదయం 9గంటల నుంచి వెల్లడి
అధికార యంత్రాంగం అంచనా
న్యూస్టుడే, వన్టౌన్
విశాఖ జిల్లాలోని ఏడు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 12 గంటల నుంచి 14గంటల సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది. జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
తొలుత పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారు. దీనికి అధిక సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. ఉదయం 8గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అసెంబ్లీ/లోక్సభ నియోజకవర్గాల వారీ అభ్యర్థుల ఆధిక్యాలు ఉదయం 9గంటల నుంచి వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈనెల 13న పోలింగ్ పూర్తయింది. అప్పటి నుంచి ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ సరళిని అంచనా వేసుకొని ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ/లోక్సభ ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. పోస్టల్ బ్యాలట్ ఓట్లు ఎక్కువుగా ఉన్నందున వాటి లెక్కింపునకు 10 నుంచి 12గంటల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఏర్పాటు చేసిన బల్లలు ఇలా..
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 98, లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కలిపి 98 చొప్పున బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ల లెక్కింపునకు విశాఖ ఎంపీ స్థానానికి 18 బల్లలు, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో దానికి 3 నుంచి 5 చొప్పున బల్లలు ఏర్పాటు చేయనున్నారు.
విశాఖ లోక్సభకు 140 రౌండ్లు..: విశాఖ లోక్సభ పరిధిలోని 1962 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లను 140 రౌండ్లలో లెక్కించనున్నారు. అదే విశాఖ జిల్లా పరిధిలోని 1991 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 142 రౌండ్లలో పూర్తి చేయనున్నారు.
భీమిలి ఓట్లను 26 రౌండ్లలో రాత్రి 7.30 గంటలకు, తూర్పు ఓట్లను 21 రౌండ్లలో సాయంత్రం 5 గంటలకు, దక్షిణం ఓట్లను 17 రౌండ్లలో మధ్యాహ్నం 3.30 గంటలకు, ఉత్తరం ఓట్లను 20 రౌండ్లలో సాయంత్రం 5 గంటలకు, పశ్చిమం ఓట్లను 16 రౌండ్లలో మధ్యాహ్నం 3.15 గంటలకు, గాజువాక ఓట్లను 22 రౌండ్లలో సాయంత్రం 5.45 గంటలకు, పెందుర్తి ఓట్లను 21 రౌండ్లలో సాయంత్రం 5.30 గంటలకు, లోక్సభ పరిధిలోని ఎస్.కోట ఓట్లను 19 రౌండ్లలో సాయంత్రం 4.30 గంటలకు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారని అంచనా వేస్తున్నారు.
ఒక్కో రౌండ్కు సుమారు అరగంట..!: లెక్కింపు సిబ్బంది తెల్లవారుజామున 4గంటలకు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. తదుపరి వారికి టేబుళ్లు కేటాయిస్తారు. పోలింగ్ ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకు రావాలి. ఉదయం 6గంటలకు ఆర్ఓల ఆధ్వర్యంలో స్ట్రాంగ్రూమ్లు తెరిచి పోస్టల్ బ్యాలట్ పెట్టెల సీళ్లను తెరుస్తారు. ఉదయం 8 గంటల సమయానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎం యంత్రాలను తీసి టేబుళ్ల మీదికి చేర్చుతారు. ఎంపిక చేసిన రెండు యంత్రాలను కేంద్ర ఎన్నికల పరిశీలకులు పరిశీలిస్తారు.
అనంతరం అభ్యర్థుల వారీ ఒక్కో రౌండ్లో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాలపై ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియకు 20 నిమిషాల నుంచి అరగంట పడుతుందని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఒక్కో నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారులు లెక్క తేల్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
[ 27-07-2024]
వంద మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరో రికార్డును సాధించింది. -
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు