నిబంధనలే అవుట్
పాయకరావుపేట నియోజకవర్గం అక్రమ లేఅవుట్లకు చిరునామాగా మారుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ లేవుట్లు పుట్టుకొస్తున్నాయి.
పేటలో శ్మశాన వాటిక పక్కన వేస్తున్న లే అవుట్
పాయకరావుపేట, న్యూస్టుడే: పాయకరావుపేట నియోజకవర్గం అక్రమ లేఅవుట్లకు చిరునామాగా మారుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల పరిధిలో పుట్టగొడుగుల్లా అక్రమ లేవుట్లు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం అక్రమార్కులకే వత్తాసు పలుకుతోంది. ఫలితంగా రోజుకో కొత్త లేఅవుట్ వెలుస్తోంది. అడ్డగోలుగా లేఅవుట్లు వేస్తున్నా, నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నా పట్టించుకునే నాథులే లేరు. ఇప్పటికే పంచాయతీ పరిధిలో స్థలాలకు సంబంధించి రికార్డులు కనిపించడం లేదు. దీంతో కొందరు పంచాయతీ స్థలాలను గుట్టుగా అమ్మకాలు చేస్తున్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినా తూతూమంత్రంగా దర్యాప్తుతో పక్కదారి పట్టిస్తున్నారు. తాజాగా మంగవరం రోడ్డులోని శ్మశాన వాటిక పక్కన మరో అక్రమ లేఅవుట్ను సిద్ధం చేస్తున్నారు. దీనికి ఏ విధమైన అనుమతులు తీసుకోలేదు. సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న స్థలాలను చదును చేసి ప్లాట్లుగా విభజిస్తున్నారు. అదేవిధంగా పి.ఎల్.పురం, సీతారాంపురం, అరట్లకోట, పాల్మన్పేట తదితర గ్రామాల్లోనూ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఈ లేఅవుట్ల వల్ల అక్కడ స్థలాలు కొంటున్న వారికి ఇబ్బందులే, కాక ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
దీనిపై ఈఓఆర్డీ చంద్రశేఖర్ను వివరణ కోరగా పంచాయతీలకు లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం లేదన్నారు. దీనిపై స్థల యజమానులకు, ఆయా పంచాయతీల కార్యదర్శులకు తాఖీదులు జారీ చేస్తామని చెప్పారు. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా అనుమతి జారీ చేస్తే చర్యలు తప్పవన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి