అత్యుత్సాహం చూపితే అరెస్టులే
ప్రజలంతా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ కోరారు.
ఎస్పీ మురళీకృష్ణ
మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ
అచ్యుతాపురం, న్యూస్టుడే: ప్రజలంతా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ కోరారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో శనివారం అచ్యుతాపురంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, దీని కోసం అన్నదమ్ముల్లా ఉండాల్సిన ప్రజలు ఘర్షణలు, కొట్లాటలకు దిగడం మంచిది కాదన్నారు. జిల్లాలో పోలీస్ చట్టంతోపాటు 144 సెక్షన్ అమలులో ఉందని... ఊరేగింపులు, ర్యాలీలు, బాణసంచా పేలుళ్లు నిషేధమన్నారు. ఎవరైనా వీటిని అతిక్రమించి అత్యుత్సాహం చూపిస్తే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఒకసారి ఎన్నికల కేసులు ఇరుక్కుంటే విద్యార్థులకు ఉద్యోగాలు, పెద్దవారికి పాసుపోర్టులు సైతం రావన్నారు. పోలీసు రికార్డుల్లో పేర్లు నమోదైతే వచ్చే 30 ఏళ్లపాటు ఎన్నికలు జరిగిన ప్రతిసారి బైండోవర్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి సామాన్యుడు ఒక పోలీస్లా పనిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు. పల్లెల్లో ఎప్పటిలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రానికి వచ్చేవారు తప్పకుండా పాసులు కలిగి ఉండాలన్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రికల్ పరికరాలకు అనుమతి లేదన్నారు. జూన్ 1న ఎగ్జిట్పోల్స్ ప్రకటించే అవకాశం ఉందని, ఇతర పార్టీ నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని హెచ్చరించారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎలమంచిలి సీఐ గఫూర్, అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు, రాంబిల్లి సీఐ లక్ష్మణరావు, సబ్బవరం సీఐ రమణ, ఎస్సై నారాయణరావు తదితరులు హాజరయ్యారు.
సమావేశానికి హాజరైన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు
- ఎస్పీ రాజకీయ నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జనరేటర్ సైతం ఏర్పాటు చేయకపోవడంపై హాజరైన రాజకీయ నాయకులు విస్తుపోయారు. విద్యుత్తు సరఫరా కోసం 15 నిమిషాలుపాటు ఎస్పీ నిరీక్షించినా ఫలితం లేకపోయింది. ఆయన వేదికపై నుంచి దిగి వెళ్లిపోయాక తిరిగి విద్యుత్తు సరఫరా వచ్చింది. దీంతో విలేకరులతో మాట్లాడడానికి మళ్లీ ఆయన వెనక్కి వచ్చారు. ఇరుకు మందిరంలో సమావేశం నిర్వహించడం, బయటకు వెళ్లడానికి ఇరుకుగా ఉండే ఒకే చిన్నపాటి దారి ఉండడంతో వచ్చినవారంతా ఆందోళన చెందారు.
పాఠశాల స్థలం కబ్జా చేస్తున్నారు
పోలీసులు, అధికారులు ఎన్నికల విధుల్లో ఉండి గ్రామాల్లో జరిగే అన్యాయాలపై దృష్టి పెట్టకుంటే ఇబ్బందులు వస్తాయని జడ్పీటీసీ సభ్యులు నర్మాలకుమార్ ఎస్పీ మురళీకృష్ణ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దోసూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు దాతలు రాసి ఇచ్చిన స్థలాన్ని కొందరు కబ్జా చేయడానికి గోతులు తీశారని ఇటువంటి సంఘటనలు పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా కలవాలని ఇది, వేదిక కాదని ఎస్పీ తెలిపారు. వైకాపా, తెదేపాకు చెందిన రాజకీయ ప్రతినిధులు ఈ సమావేశంలో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు