logo

చెరువులవెనంలో సందడి

చింతపల్లిలోని పర్యటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. లంబసింగి, చెరువులవెనం, తాజంగి, ఎర్రవరం జలపాతాల వద్దకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు వచ్చారు. ఆ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి.

Published : 27 May 2024 04:33 IST

చింతపల్లి, న్యూస్‌టుడే : చింతపల్లిలోని పర్యటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. లంబసింగి, చెరువులవెనం, తాజంగి, ఎర్రవరం జలపాతాల వద్దకు దూరప్రాంతాల నుంచి పర్యటకులు వచ్చారు. ఆ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి.

చాపరాయిలో రద్దీ

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పర్యటక కేంద్రం చాపరాయి జలవిహారిలో ఆదివారం సందడి నెలకొంది. నెలరోజులపాటు సార్వత్రిక ఎన్నికలు, ఎండ తీవ్రతతో పర్యటక ప్రాంతాలు వెలవెలబోయాయి. ప్రస్తుతం వేసవి సెలవులతోపాటు ఎన్నికలు ముగియడంతో మన్యం అందాలు తిలకించేందుకు పర్యటకులు బారులు తీరుతున్నారు. జలవిహారిలో సందర్శకులు స్నానాలు చేస్తూ, థింసా నృత్యంలో భాగస్వాములవుతూ ఆనందంగా గడుపుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని