ముంపు ముప్పు.. ఇకనైనా మేల్కోరా..!
వేసవి కాలం ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ అధికారులు నగరంలోని గెడ్డల్లో పూడికలు తొలగించి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల విధుల పేరుతో ఇంజినీరింగ్ అధికారులు కాలం గడిపేశారు.
వ్యర్థాలతో నిండిపోయిన గెడ్డలు
పూడికతీతకు జీవీఎంసీ మీనమేషాలు
జ్ఞానాపురం సమీపంలోని గెడ్డలో ప్లాస్టిక్, థర్మోకోల్ వ్యర్థాలు
కార్పొరేషన్, న్యూస్టుడే : వేసవి కాలం ముగిసి వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ అధికారులు నగరంలోని గెడ్డల్లో పూడికలు తొలగించి ముంపు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల విధుల పేరుతో ఇంజినీరింగ్ అధికారులు కాలం గడిపేశారు. దీంతో ప్రధాన గెడ్డలతోపాటు, మిగతా గెడ్డల్లోనూ వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. ఓ మోస్తరు వర్షం పడినా కొన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. గత ఏడాది ఇలాంటి పరిస్థితి తలెత్తినా..ఈ ఏడాది అధికారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
నిర్లక్ష్యం వీడకపోతే ఇదీ పరిస్థితి
భారీ వర్షం పడిన సమయంలో పోర్టు అధికారులు గేట్లను తెరవకపోతే జ్ఞానాపురం, చావలమదుం, రామకృష్ణబజారు, పూర్ణమార్కెటÂ, ఇందిర ప్రియదర్శిని స్టేడియం పరిసరాలు మునిగిపోతుంటాయి. గత ఏడాది కురిసిన వర్షానికి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఆయా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరి గంటల తరబడి ప్రజలు నీటిలోనే ఉండాల్సి వచ్చింది. 96వ వార్డులోని ఏకలవ్యకాలనీ ఎప్పటికప్పుడు ముంపునకు గురవుతూ ఉంటుంది. మేహాద్రిగెడ్డకు వర్షపు నీటిని తీసుకెళ్లే గెడ్డకు పక్కనే ఈ కాలనీ ఉంది. మేహాద్రి రిజర్వాయర్ నిండిన తరువాత నీరంతా గెడ్డల ద్వారా విమానాశ్రయం పక్కగా సముద్రంలోకి వెళుతుంది. ఆయా గెడ్డల్లో పూడికలు తొలగించకపోవడంతో మేహాద్రి నుంచి నీరు వదిలితే నాలుగు గంటల వరకు ఏకలవ్యకాలనీ వరదలోనే ఉంటోంది.
పొంచి ఉన్న ‘పోర్టు గేట్లు’..
నగరంలో ఉత్పత్తి అయ్యే వాడుక నీరంతా పాతనగరంలోని ఎర్రిగెడ్డ, గంగుల గెడ్డ, ఎస్ఎల్ కెనాల్ల ద్వారా సముద్రంలో కలుస్తుంది. పోర్టు పరిధిలోని ప్రాంతం నుంచి ఆయా గెడ్డలు వెళుతున్నాయి. వ్యర్థాలతో ఉన్న నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడానికి పోర్టు అధికారులు అంగీకరించడం లేదు. ఈ మేరకు ఎర్రిగెడ్డ, గంగులగెడ్డ సముద్రంలో కలిసే ప్రాంతాల్లో గేట్లను ఏర్పాటు చేశారు. వ్యర్థాల కారణంగా నౌకల రాకపోకలకు ఆటంకం కలుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి జీవీఎంసీ గెడ్డల్లోని వ్యర్థాలను తొలగిస్తేనే ఆయా గేట్లను పోర్టు అధికారులు తెరుస్తారు.
ఏటా రూ.7కోట్ల నుంచి రూ.9కోట్ల వ్యయం
ఏటా మే నెలలో నగరంలోని గెడ్డల్లో పూడిక, వ్యర్థాలను తొలగించడానికి జీవీఎంసీ కార్యాచరణ ప్రారంభిస్తుంది. దీని కోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ నెలరోజులకుపైగా కొనసాగుతుంది. దీనికి రూ.7 కోట్ల నుంచి రూ.9కోట్ల వరకు వెచ్చిస్తారు. ఒక్క ఏడాది ఈ ప్రక్రియ సరిగా జరగకపోయినా నగరవాసులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికలు రావడంతో అధికారులు ఆయా పనుల్లో నిమగ్నమై పూడికతీత గురించి పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా అడిగితే ఎన్నికల కోడ్ ఉందని చెప్పి తప్పించుకున్నారు.
ప్రమాద ఘటనలు ఇలా..
భారీ వర్షాలు పడిన సమయంలో గతంలో ఎర్రిగెడ్డ, మల్కాపురం గెడ్డల్లో ఇద్దరు వృద్ధులు కొట్టుకుపోయి మృతి చెందారు. మద్దిలపాలెం కృష్ణా కళాశాల రోడ్డులో ఐదేళ్ల చిన్నారి కాలువలో పడి సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఐదు రోజుల తరువాత భోగాపురం తీరానికి మృతదేహం కొట్టుకొచ్చింది. ఏటా ప్రమాదకరమైన ఘటనలు చోటుచేసుకున్నా జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు కళ్లు తెరవకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
[ 27-07-2024]
ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల బయలుదేరే సమయాల రీ షెడ్యూల్తోపాటు, కొన్నింటి గమ్యాలను కుదించినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
[ 27-07-2024]
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్రథ్ ఎక్స్ప్రెస్కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్)కి మారింది. -
పర్యాటకం.. కొంగొత్తగా!!
[ 27-07-2024]
విశాఖ అంటే సముద్ర విహారం గుర్తుకొస్తుంది. ప్రస్తుతం హార్బర్లో 8 సీట్ల బోటు పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
పంచాయితీలకే పెద్దపీట
[ 27-07-2024]
న్యాయం కోసం కొన్ని పోలీసుస్టేషన్ల గడప తొక్కుతున్న బాధితులు అక్కడ ఎదురయ్యే పరిస్థితులను చూసి కంగుతింటున్నారు. -
రికార్డు గదుల్లో రక్షణ కీలకం..!
[ 27-07-2024]
రెవెన్యూ, సర్వే, సబ్ట్రెజరీ కార్యాలయాల్లో రికార్డు గదులను కీలకంగా భావిస్తారు. అత్యంత పురాతన రికార్డుల నుంచి ప్రస్తుత కాలానికి సంబంధించిన రికార్డులను అక్కడ భద్రపర్చుతారు. -
వుషూలో హుషారు!
[ 27-07-2024]
వుషూ.. ఈ ఆటలో నర్సీపట్నం పేరు కొంతకాలంగా మార్మోగుతోంది. ఇప్పటికే ఈ క్రీడలో జిల్లాస్థాయి పోటీల్లో అనేక మంది ప్రథమస్థానాలు దక్కించుకున్నారు. -
ఉద్యోగం ఇక్కడ.. పనిచేసేది అక్కడ!
[ 27-07-2024]
అందరికీ వైద్యం సకాలంలో అందించాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందుకు భిన్నంగా చౌడువాడ ఆరోగ్య కేంద్రంలో పరిస్థితులున్నాయి. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
వీర సైనికా వందనం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన సైనికులకు శుక్రవారం బీచ్ రోడ్లో జరిగిన ‘కార్గిల్ విజయ్ దివస్’ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
‘స్థాయీ’ నామపత్రాలకు 29న ముహూర్తం..!
[ 27-07-2024]
మహా విశాఖ నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలకు ఈనెల 29న నామపత్రాలు(నామినేషన్లు) వేయాలని కూటమి పార్టీలు, వైకాపా నిర్ణయించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్